పెద్దశంకరంపేట, ఏప్రిల్ 5: టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో పార్టికి మరింత ఆదరణ పెరిగిందని ఖేడ్ ఎమ్మెల్యే భూపాల్రెడ్డి అన్నారు. సోమవారం నారాయణఖేడ్ క్యాంపు కార్యాలయంలో పెద్దశంకరంపేట మండలం గోపని వెంకటాపురానికి చెందిన 1వ వార్డు సభ్యుడు మచ్కూరి రాములుతోపాటు పలువురు కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీనుంచి టీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా వారికి పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో జడ్పీటీసీ విజయరామరాజు, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు దత్తు, పీఏసీఎస్ వైస్ చైర్మన్ సువర్ణ ఉన్నారు.
ప్రభుత్వ పథకాలను సద్వినియోగించుకోవాలి
ప్రభుత్వ పథకాలను ప్రతిఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఖేడ్ ఎమ్మెల్యే భూపాల్రెడ్డి అన్నారు. సోమవా రం నారాయణఖేడ్ క్యాంపు కార్యాలయంలో పెద్దశంకరంపేట మండలం టెంకటి గ్రామానికి చెందిన సద్గుణకు సీఎం రిలీప్ఫండ్ పథకం కింద మంజూరైన రూ.22వేల చెక్కును వారికి అందజేశారు. బడుగు, బలహీనవర్గాల కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందన్నారు. నిరుపేదలకు సీఎంఆర్ఎఫ్ పథకం ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు. కార్యక్రమంలో జడ్పీటీసీ విజయరామరాజు, పీఏసీఎస్ వైస్ చైర్మన్ సువర్ణ అంజయ్య పాల్గొన్నారు.
ఇవీ కూడా చదవండి…
అభివృద్ధికి ‘సిద్దిపేట’ మారుపేరు
స్ఫూర్తిదాయకం.. బాబూ జగ్జీవన్రామ్