మెదక్ రూరల్, జూలై 2 : ప్రజల భాగస్వామ్యంతో ప్రతి పల్లెనూ అభివృద్ధి పథంలోకి తీసుకెళుదామని మెదక్ కలెక్టర్ హరీశ్ అన్నారు. శుక్రవారం మండలంలోని వెంకటపూర్ పంచాయతీ పరిధిలోని కోంటూర్లో పల్లె ప్రగతిలో భాగంగా కలెక్టర్ పర్యటించారు. ఈ సందర్భంగా అక్కడ జరుగుతున్న పనులను పరిశీలించి, సంతృప్తి వ్యక్తం చేశారు. సర్పంచ్, పంచాయతీ కార్యదర్శిని అభినందించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ గ్రామంలో ఖాళీ ప్రదేశాల్లో మొక్కలు నాటాలని సూచించారు. ప్రతి ఇంటికీ ఆరు మొక్కలు పంపిణీ చేయాలన్నారు. గ్రామాల్లో పారిశుధ్యం, పచ్చదనానికి ప్రాధాన్యత నిచ్చి వంద శాతం పనులు పూర్తి చేయాలని సూచించారు. సీజనల్ వ్యాధులపై అవగాహన కల్పించాలన్నారు. కలెక్టర్ వెంట సర్పంచ్ రాజలక్ష్మీరవీందర్, పంచాయతీ కార్యదర్శి ప్రభాకర్, ఉపసర్పంచ్ లక్ష్మిమ్మ, టీఆర్ఎస్ నాయకులు, రవీందర్, నాగరాజు, ప్రసాద్ ఉన్నారు.
జిన్నారం, సోలక్పల్లి గ్రామాల్లో పర్యటించిన సంగారెడ్డి అదనపు కలెక్టర్
జిన్నారం, జూలై 2 : పల్లె ప్రగతి పనులు సత్ఫలితాలు ఇస్తున్నాయని సంగారెడ్డి అదనపు కలెక్టర్ రాజర్షి షా అన్నారు. నాల్గో విడుత పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా శుక్రవారం మండల కేంద్రం జిన్నారం, సోలక్పల్లి గ్రామాల్లో అదనపు కలెక్టర్ డీఎల్పీవో సతీశ్రెడ్డితో కలిసి పర్యటించారు. పల్లె ప్రకృతి వనం, వైకుంఠధామం, డంపింగ్యార్డు, నర్సరీ, రైతు వేదికలను పరిశీలించారు. జిన్నారంలోని పల్లె ప్రకృతి వనం ఆహ్లాదంగా ఉందన్నారు. రోడ్లకు ఇరువైపులా నాటిన మొక్కలను చూసి సంతోషం వ్యక్తం చేశారు. పల్లె ప్రకృతి వనంలో సేంద్రియ ఎరువులతో పెంచుతున్న కూరగాయలు, పూల మొక్కలను చూసి ముచ్చటపడ్డారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పల్లె ప్రగతి పనులు చాలా బాగున్నాయని కితాబునిచ్చారు. ఇం టింటికీ ఆరు మొక్కలు నాటాలని సూచించారు. మొక్కల పెంపకం, నర్సరీ నిర్వహణ, పల్లె ప్రకృతి వనాన్ని పరిశీలించారు. జిన్నారం సర్పంచ్ లావణ్యశ్రీనివాస్రెడ్డి, పంచాయతీ కార్యదర్శి స్రవంతిని అభినందించారు. ప్రభుత్వం ప్రతి మండలంలో ఒక పెద్ద పార్కు ఏర్పాటు చేయనున్న నేపథ్యంలో జిన్నారంలో పార్కును ఏర్పాటు చేయాలని సర్పంచ్ అదనపు కలెక్టర్ దృష్టికి తీసుకురాగా, విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు. గడ్డపోతారం పంచాయతీ అల్లీనగర్లో సర్పంచ్ ప్రకాశ్చారి ఈవో, ప్రజాప్రతినిధులతో కలిసి పర్యటించారు. ఆయన వెంట సర్పంచ్లు లావణ్యశ్రీనివాస్రెడ్డి, శ్రీకాంత్రెడ్డి, ఎంపీవో రాజ్కుమార్, ఎంపీటీసీలు వెంకటేశంగౌడ్, స్వాతీప్రభాకర్రెడ్డి, ఉప సర్పంచ్ సం జీవ, కార్యదర్శి స్రవంతి ఉన్నారు.