సంగారెడ్డి కలెక్టరేట్, డిసెంబర్ 22 : గణిత శాస్త్రవేత్త శ్రీనివాస రామానుజన్ జన్మదినాన్ని పురస్కరించుకొని శుక్రవారం జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో జాతీయ గణిత దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రామానుజన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు గణితంలో పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులను అందజేశారు. తారా ప్రభుత్వ డిగ్రీ, పీజీ అటానమస్ కళాశాలలో గణిత దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు.
నాగల్గిద్ద, డిసెంబర్ 22 : గణిత శాస్త్రవేత్త రామానుజన్ జయంతిని శుక్రవారం పాఠశాలల్లో ఘనంగా నిర్వహించా రు. అనంతరం కరస్గుత్తి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 1789 ఆకారంలో గణిత శాస్త్రన్ని సూచిస్తు విద్యార్థులు ప్రదర్శన నిర్వహించారు.
సిర్గాపూర్, డిసెంబర్ 22 : మండలంలోని ప్రాథమికొన్న త, హైస్కూల్ పాఠశాలలో ఘనంగా జాతీయ గణిత దినోత్స వం కార్యక్రమాన్ని జరుపుకున్నారు. స్థానిక కస్తూర్బాలో ప్రిన్సిపాల్ లలిత ఆధ్వర్యంలో అధ్యాపకులు మ్యాథ్స్ దినోత్సవం సందర్భంగా క్విజ్, వ్యాసరచన పోటీలను నిర్వహించారు. అంతకుముందు పాఠశాల ఆవరణలో బాలికలు శ్రీనివాస రామనుజన్ చిత్రాన్ని రంగుల ముగ్గులతో వేసి అలరించారు. ప్రతిభ కనబరిచిన బాలికలకు బహుమతు లు అందజేశారు. జడ్పీహెచ్ఎస్లో మ్యాథ్ ఉపాధ్యాయులకు జీహెచ్ఎం నాగారం శ్రీనివాస్ శాలువా కప్పి సన్మానం చేశారు.
కోహీర్, డిసెంబర్ 22 : మండలంలోని ఆయా గ్రామాల్లో ఉన్న జడ్పీ ఉన్నతపాఠశాలలతో పాటు ప్రైవేటు పాఠశాలల్లో శుక్రవారం జాతీయ గణిత దినోత్సవాన్ని ఉత్సాహంగా నిర్వహించారు. శ్రీనివాస రామానుజన్ జయంతి, గణిత దినోత్సవం సందర్భంగా స్టాల్స్ను ఏర్పాటు చేశారు. జీఎంఆర్ పాఠశాలల్లో 1727 అకారంలో విద్యార్థులు మానవహారం నిర్వహించారు. స్టాల్స్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులను అందజేశారు.
న్యాల్కల్, డిసెంబర్ 22 : మండలంలోని మెటల్కుంట పరిషత్ ఉన్నత పాఠశాలలో గురువారం నిర్వహించిన గణిత ప్రదర్శన ఆకట్టుకుంది. గణిత శాస్త్రవేత్త శ్రీనివాస రామానుజన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం గణిత ప్రదర్శనను నిర్వహించారు.