హుస్నాబాద్, డిసెంబర్ 1: నియోజకవర్గ కేంద్రమైన హుస్నాబాద్కు 50 పడకలతో కూడిన మాతా శిశు సంరక్షణ కేంద్రాన్ని ప్రభు త్వం మంజూరు చేసిందని, అన్ని హంగులతో భవన నిర్మాణం కూడా త్వరలో పూర్తవుతుందని జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి డాక్టర్ కాశీనాథ్ అన్నారు. గురువారం వైద్యా విధాన పరిషత్ జిల్లా కోఆర్డినేటర్ డాక్టర్ సాయికిరణ్తో కలిసి ఈ నెల 5న హుస్నాబాద్లో మంత్రి పర్యటన, దవాఖాన సందర్శన కార్యక్రమాలపై స్థానిక అధికారులు, వైద్యులు, ప్రజాప్రతినిధులతో సమీక్ష జరిపారు. కొత్తగా నిర్మించబోయే మాతా శిశు సంరక్షణ కేంద్రం భవన నిర్మాణ స్థలాన్ని పరిశీలించారు. మంత్రి ప్రారంభించబోయే డయాలసిస్ సెంటర్ను సందర్శించారు. దవాఖానలో ఇంకా కావాల్సిన సౌకర్యాలు, మంత్రి పర్యటన సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై స్థానిక అధికారులు, వైద్యులకు సూచించారు. ఈ సందర్భంగా డాక్టర్ కాశీనాథ్ మాట్లాడుతూ ఈ నెల 5న కొత్తగా నిర్మించబోయే మాతా శిశు సంరక్షణ కేంద్రం భవన నిర్మాణానికి మంత్రి హరీశ్రావు శంకుస్థాపన చేస్తారని తెలిపారు.
దవాఖానలో కొత్తగా ఏర్పాటుచేసిన 5 పడకలతో కూడిన డయాలసిస్ సెంటర్ను మం త్రి ప్రారంభిస్తారని చెప్పారు. వైద్యవిధాన పరిషత్ జిల్లా కోఆర్డినేటర్ డాక్టర్ సాయికిరణ్ మాట్లాడుతూ హుస్నాబాద్ దవాఖానలో రోగులకు సరిపడా సౌకర్యాలు కల్పించినట్లు తెలిపారు. దవాఖాన ఆవరణలో నిర్మించిన శంకుస్థాపన శిలాఫలకం చుట్టుపక్కల చదును చేయించాలన్నారు. అనంతరం బస్తీ దవాఖాన ఏర్పాటు చేయబోయే గోదాం గడ్డలోని వ్యవసాయ శాఖ కార్యాలయ భవనాన్ని పరిశీలించారు. కార్యక్రమంలో దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ రమేశ్రెడ్డి, డిప్యూటీ డీఎంహెచ్వో డాక్టర్ సౌమ్య, మాజీ ఎంపీపీ ఆకుల వెంకట్, వైద్య అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.