మెదక్ మున్సిపాలిటీ, జూన్ 4: పోతరాజుల విన్యాసాలు, యువకుల కేరింతలు, మహిళల పూనకాలు, బ్యాండ్మేళాల మధ్య మెదక్ పట్టణ మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో ఆదివారం మాతా నల్లపోచమ్మ బోనాల ఉత్సవం అంగరంగవైభవంగా జరిగింది. ఉదయం ము న్నూరు కాపుల ఆరాధ్య దైవం నల్లపోచమ్మకు ప్రత్యేక పూజలు చేసి నైవేద్యం సమర్పించారు. సాయంత్రం నెత్తిన బోనాలతో మహిళలు పెద్దఎత్తున బోనాలతో ఆలయానికి చేరుకొని బోనం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.
ఈ బోనాల ఉత్సవంలో ఎమ్మెల్సీ శేరి సుభాష్రెడ్డి, ఇఫ్కో డైరెక్టర్ దేవేందర్రెడ్డి, మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్, టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు నరేందర్, మున్నూరుకాపు సంఘం రాష్ట్ర నాయకుడు కాస నాగరాజు, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ రాగి అశోక్ తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి మున్నూరుకాపు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కొండ దేవయ్య, జిల్లా అధ్యక్షుడు బట్టి ఉదయ్, మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్తో కలిసి మాత నల్లపోచమ్మను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సంఘం జిల్లా భవనం కోసం ఎకరం స్థలాన్ని మంజూరు చేస్తూ ప్రొసీడింగ్ అందజేశారు. మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో ఎమ్మెల్యేను ఘనంగా సన్మానించారు. డీఎస్పీ సైదులు ఆధ్వర్యంలో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.