వ్యవసాయ యూనివర్సిటీ, మార్చి 13: ఈ ఏడాది మామిడికి అనుకూల వాతావరణ పరిస్థితులు ఉన్నా, మార్చిలో తగు జాగ్రత్తలు పాటిస్తేనే అధిగ దిగుబడి సాధించవచ్చని కొండాలక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం పరిధిలోని రాజేంద్రనగర్ ఉద్యాన కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ నాగహర్షిత సూచిస్తున్నారు. ఉద్యాన శాస్త్రవేత్తల, అధికారుల సూచనలు ఎంతో కీలకమని ఆమె చెప్పారు. మామిడి ప్రస్తుతం పిందె, కాత దశలో ఉందన్నారు.
పిందె, కాయలపై తేనెమంచు, కాండం తొలుచు, కాయతొలుచు పురుగులు, మసిమంగు, పిండి నల్లి, బూడిద తెగుళ్లు అధికంగా కనిపిస్తున్నాయని తెలిపారు. వెంటనే తగు జాగ్రత్తలు పాటించకపోతే అపార నష్టం వాటిళ్లుతుందన్నారు. కాయ పెరుగుదల దశలో వీలైనంత వరకు డ్రిప్ ద్వారా చెట్టుకు నీరందించాలని సూచించారు. కాయలకు కవర్ తొడుగు ఉంచడంతో ఆరోగ్యంగా పెరుగుతుందని సూచించారు.
ఈ పురుగు ఆకు, పువ్వు, పిందెలపై చేరి ర సాన్ని పీలుస్తామన్నారు. పూత, పిందె వాడిపోయి రాలిపోతుందన్నారు. పురుగు విసర్జించిన తేనెలాంటి తియ్యని పదార్థంపై మసి గల శిలీంధ్రాలు పెరుగుతాయని తెలిపారు. దీంతో నల్లని మసిమంగు ఏర్పడుతుందన్నారు. ఈ పురుగు కాయలేని కాలంలో కొ మ్మల బెరడులోని దాగి ఉంటుందని, అనంతరం లేత ఆకులపై, పూరెమ్మలపై ఉంటుందన్నారు. వాతావరణ పరిస్థితుల్లో హెచ్చుతగ్గులు, అంటే చలిగా ఉన్నప్పుడు ఎక్కువ ఉధృతి ఉంటుందన్నారు. తేనెలాంటి బంక ఆకులపై చేరడంతో సూర్యరశ్మి వెలుగులో మెరుస్తుందని తెలిపారు. తేనెమంచు నివారణకు లీటర్ నీటిలో డైమిథోయేట్ 2 మి.లీ లేదా క్లోరిపైరిపాస్ తగు మోతాదులో నీటిలో కలిపి పిచికారి చేయాలన్నారు.
కాండం తొలిచే పురుగు సోకినప్పుడు చెట్టు ఎండిపోతుందని, గట్టి ఇనుప తీగ సహాయంతో పురుగును తొలిగించాలన్నారు. పురుగు విసర్జన, పురుగు కొమ్మను తట్టినప్పుడు వచ్చే శబ్ధాన్ని గుర్తించి తగు చర్యలు తీసుకోవాలన్నారు.
ఎండు పుల్లలో నిద్రావస్థ దశలో రెక్కల పురుగు వెలువడి కాయల మీద గుడ్డు పెడుతుందన్నారు. ఈ పురుగు మామిడి పండ్ల దశలో మూడు తరాలు వృద్ధి చెందుతుందన్నారు. అనంతరం పంటను ఆశిస్తాయని, పురుగు ఆశించిన చెట్టును తొలిగించాలని సూచించారు.
భూమిలో పొదగబడిన గుడ్డు, పిల్లపురుగులు చెట్లపైకి పాకుతుందన్నారు. చీమల ద్వారా పైకి పాకి గుంపులుగా చేరి రసాన్ని పీలుస్తాయని తెలిపారు. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో దీని ప్రభావం అధికంగా ఉంటుందన్నారు. దీనివల్ల కాయలు సరిగ్గా ఎదగకుండా రాలిపోతాయన్నారు. నివారణకు మిథైల్ పెరాథియాన్ను పిచికారీ చేయాలపి సూచించారు. టెంకపురుగు కాయలోపలికి చొచ్చుకుని పోయి లోపల గోకి తింటుందని, ఇది ఆలస్యంగా కోతదశలో కనిపిస్తుందన్నారు. నివారణకు మి.లీ ఫినిట్రోథియాను లీటర్ నీటితో కలిపి పిచికారీ చేయాలన్నారు.
ఆకులు, పూత, పిందెలు, కాయలమీద రసం పీల్చే తేనెమంచు పురుగు, పిండినల్లి, తామర పురుగులు, చీడపీడలు ఆశించినప్పుడు (సోకినప్పుడు).. అవి విసర్జించిన తేనెలాంటి పదార్థం పై శిలీంద్రాలు క్యాప్నోడియం పరాన్న భుక్కులుగా పెరిగి నల్లని మసి తెగుళ్లు వస్తుందన్నారు. కొంతకాలం తర్వాత ఇవి మసిమంగుగా మారుతుందన్నారు. తెగుళ్లు సోకిన కాయలపై నల్లని మచ్చలుగా ఏర్పడి అవి అమ్మకానికి డిమాండ్ లేకుండా పోతాయని తెలిపారు. ఇది ఎక్కువగా మార్చి నెలలో దీని ప్రభావం ఉంటుందని, కనుక జాగ్రత్త అవసరం అన్నారు. జిగురు లేని కాయలపై మసి తెగుళ్లు సోకదని, ఆకు మసి తెగుళ్లు కనిపిస్తే.. 2 శాతం గంజి ద్రావణం పిచికారీ చేయాలని సూచించారు.
ఈ తెగులు ఆకు మీద, పూరెమ్మల పైన, బూడిద వంటి తెల్లని పదార్థం వ్యాపించి పూత, పిందె రాలిపోతుందన్నారు. ఇది పూత కాలంలో కనబడుతుందన్నారు. నివారణకు నీటిలో కరిగే గంధకం 3గ్రాములు, లేదా కెరాథేన్ మి.లీ కలిపి పిచికారీ చేయాలని అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ నాగహర్షిత సూచించారు.
ఈసారి రాష్ట్రం నుంచి మామిడి అధిక దిగుబడి రానుందన్నారు. మెళకువలతో మామిడిని రక్షిస్తే ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేసి అధిక లాభాలు పొందవచ్చన్నారు. మామిడిని దేశంలోనే అధికంగా సాగుచేసేది తెలంగాణేనని, అందుకు ఇక్కడి వాతావరణ పరిస్థితులు, నేలలు అనుకూలమని వెల్లడించారు. ప్రస్తుతం తగు జాగ్రత్తలు పాటించాలని సూచించారు.