Manchu Vishnu | పాపన్నపేట, జూలై 18: తెలంగాణలోని ప్రముఖ దేవస్థానమైన వనదుర్గ భవానీ మాతను సినీ హీరో మంచు విష్ణు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయన ఏడుపాయల చేరుకోగానే మెదక్ జిల్లా అదనపు కలెక్టర్ మెంచు నగేష్ సాదర స్వాగతం పలికారు.
మెదక్ జిల్లాలో పర్యాటక రంగం అభివృద్ధిలో భాగంగా జిల్లా యంత్రాంగం ఆహ్వానం మేరకు పర్యాటక ప్రాంతాలను సందర్శించేందుకు మంచు విష్ణు శనివారం వచ్చారు. ముందుగా పాపన్నపేట మండల పరిధిలోని ఏడుపాయల వనదుర్గ భవానీ ఆలయాన్ని ఆయన సందర్శించి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ పూజారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం ఆలయ చరిత్ర, ఆలయ ప్రశస్తిని జిల్లా అదనపు కలెక్టర్ మెంచు నగేష్ విష్ణుకు వివరించారు.