కొల్చారం, డిసెంబర్ 9 : ప్రభుత్వ పాఠశాలల్లో చేపట్టిన ‘మనఊరు-మనబడి’ పనులు డిసెంబర్ నెలాఖరులోగా పూర్తి చేయాలని మండల విద్యాధికారి నీలకంఠం ఆదేశించా రు. కొల్చారం మండల పరిషత్ కార్యాలయంలో శుక్రవారం ‘మన ఊరు-మనబడి’ పనులపై ప్రధానోపాధ్యాయులు, సర్పంచ్లు, విద్యాకమిటీ చైర్మన్లతో సమీక్ష నిర్వహించారు. జిల్లా సైన్స్ అధికారి రాజిరెడ్డి, ఎంపీపీ మంజులాకాశీనాథ్ ఆధ్వర్యంలో సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎంఈ వో నీలంకంఠం మాట్లాడుతూ మండ లంలో మొదటి విడతగా 16 పాఠశాలలకు ‘మనఊరు-మనబడి’ పథకం నిధు లు మంజూరైనట్లు, ఇక్కడి పనులు పూర్తి కాగానే, మరో 16 పాఠశాలలకు నిధులు మంజూరు చేస్తామన్నారు. కొల్చారం, చిన్నాఘన్పూర్లోని మోడల్ స్కూళ్లలో చేపట్టిన పనులు డిసెంబర్ నెలాఖరులోగా పూర్తి చేయాలని, జనవరి మొదటి వారంలో భవనాలను పెయింటింగ్ వేయిస్తామన్నారు. ఈ రెండు స్కూళ్లకు త్వరలో పర్నిచర్ వస్తుందన్నారు. మిగతా పాఠశాలల్లో చేపట్టిన పనుల పురోగతిపై స్థానిక సర్పంచ్లతో మాట్లాడి తెలుసుకున్నారు. పెట్టుబడి పెట్టినా బిల్లులు రావ డం లేదని ఎనగండ్ల సర్పంచ్ వీరారెడ్డి తెలుపగా, ‘మనఊరు మనబడి’ పనులకు నిధుల కొరత లేదని ఎంఈవో పేర్కొన్నారు. పనులు పూర్తి చేసి ఫొటో ఆప్లోడ్ చేసిన వెంటనే బిల్లులు మంజూ రు చేస్తామన్నారు.
ఈజీఎస్లో చేపట్టనున్న ప్రహరీ నిర్మాణాలకు బిల్లుల చెల్లింపు ఆలస్యమవుతుందని పీఆర్ఏఈ ఇర్ఫాన్ హుస్సేన్ తెలిపారు. ఎనగండ్ల పాఠశాలలో మధ్యాహ్న భోజన బాధ్యతలను అక్షయ పాత్రకు అప్పగించాలని సర్పంచ్ వీరారెడ్డి కోరారు. సమీక్ష లో పీఆర్డీఈ అమరేశ్వర్, ఏఈలు ఇర్ఫాన్, మహేశ్, సర్పంచ్లు గోదావరి, ఇందిరాప్రియదర్శిని, ఎంపీపీ ఆఫీస్ సూపరింటెండెంట్ విఠల్నాయక్, కాంప్లెక్స్ హెచ్ఎం నర్సింహులు పాల్గొన్నారు.
పనులన్నీ నాణ్యతా ప్రమాణాలతో చేపట్టాలి
చిలిపిచెడ్, డిసెంబర్ 9 : మండలంలోని పాఠశాలల్లో చేపట్టిన ‘మనఊరు-మనబడి’ పనులన్నీ పూర్తి చేయాలని జిల్లా ప్రాజెక్ట్ ఏఎస్వో శశిధర్, ఎంఈవో బుచ్చానాయక్ పేర్కొన్నారు. మండలకేంద్రం చిలిపిచెడ్ ఉన్నత పాఠశాలలో ‘మనఊరు-మనబడి’ పనులపై విద్యా కమిటీ చైర్మన్లు, ఉపాధ్యాయులతో సమీక్ష నిర్వహించారు. ‘మనఊరు-మనబడి’ లో అజ్జమర్రి, ఫైజాబాద్ పాఠశాలుగా ఎంపికయ్యాయని, త్వ రలో పనులు పూర్తి చేయాలని సూచించారు. ఏమైనా సమస్యలుంటే సంబంధిత అధికారులకు వివరించాలని సూచిం చారు. సమీక్షలో పీఆర్ ఏఈ మధుబాబు, నోడల్ అధికారి విఠల్, ఉపాధ్యాయులు, ఎస్ఎంసీ చైర్మన్లు పాల్గొన్నారు.