పాపన్నపేట, మార్చి29 : ట్రాక్టర్ బోల్తాపడి ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన కొడుపాక గ్రామ శివారులో మంగళవారం తెల్లవారు జామున చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. పాపన్నపేట మండల పరిధిలోని కొడుపాక గ్రామానికి చెందిన చీతరాల రామచందర్(45) ఏడుపాయలలో సోదరుని వివాహ విందు ముగించుకొని, తన సొంత ట్రాక్టర్ పై వస్తున్నాడు.
కొడుపాక గ్రామశివారులోని బచ్చలోనికుంట సమీపంలో ట్రాక్టర్ బోల్తా పడడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య సునిత, ముగ్గురు కుమారులు ఉన్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని, మృతదేహానని పోస్టుమార్టం నిమిత్తం మెదక్ ప్రభుత్వ దవాఖానకు తరలించామని ఎస్సై విజయ్కుమార్ తెలిపారు.