తూప్రాన్, మార్చి 21: మెదక్ జిల్లా తూప్రాన్ మున్సిపల్ నూతన చైర్పర్సన్గా 4వ వార్డు కౌన్సిలర్ మామిండ్ల జ్యోతీకృష్ణ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎన్నికైనట్లు ధ్రువీకరణ పత్రాన్ని గురువారం ఎన్నికల ప్రిసైడింగ్ అధికారి, తూప్రాన్ ఆర్డీవో జయచంద్రారెడ్డి ఆమెకు అందజేశారు. తూప్రాన్ మున్సిపల్ చైర్మన్ రాఘవేందర్గౌడ్పై ఫిబ్రవరి 12న ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం మార్చి 6న నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో నెగ్గింది. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు గురువారం ఉదయం 11గంటలకు నూతన చైర్మన్ ఎన్నిక ప్రక్రియను ప్రత్యేక సమావేశం ద్వారా ఎన్నికల ప్రిసైడింగ్ అధికారి ప్రారంభించారు. 11.30 గంటల వరకు ఎమ్మెల్సీ కూర రఘోత్తం సహా 11 మంది కోరం సభ్యులంతా సమావేశానికి హాజరయ్యారు.
ప్రిసైడింగ్ అధికారి ఎన్నికల నియమావళిని వివరించిన అనంతరం చైర్మన్ పదవికి నామినేషన్లను అనుమతించారు. ఎన్నికల నియమావళి ప్రకారం తూప్రాన్ మున్సిపల్ 4వ వార్డు కౌన్సిలర్ మామిండ్ల జ్యోతీకృష్ణను మున్సిపల్ చైర్పర్సన్గా 7వ వార్డు కౌన్సిలర్ జిన్న భగవాన్రెడ్డి ప్రతిపాదించగా, 16వ వార్డు కౌన్సిలర్ కొడిప్యాక నారాయణగుప్తా ఆమోదిం చారు. చైర్మన్ పదవికి ఒకే నామినేషన్ రావడంతో మామిండ్ల జ్యోతికృష్ణ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఆర్డీవో జయచంద్రారెడ్డి ప్రకటించారు. అనంతరం మామిండ్ల జ్యోతీకృష్ణ ప్రమాణ స్వీకారం చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఖాజా మోయిజుద్దీన్, మేనేజర్ రఘువరణ్, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.