చిలిపిచెడ్, డిసెంబర్ 28 : ‘మనఊరు – మనబడి’ పనులతో ప్రభుత్వ బడులకు మహర్దశ వస్తున్నదని నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్రెడ్డి అన్నారు. బుధవారం అజ్జమర్రి గ్రామంలో ‘మన ఊరు – మనబడి’లో ఎంపికైన ప్రాథమిక పాఠశాలను సందర్శంచారు.
పాఠశాలలో మౌలిక వసతులను సర్పంచ్ పరశురాంరెడ్డిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ప్రభుత్వ బడుల అభివృద్ధికి అధిక ప్రాధా న్యత ఇస్తున్నట్లు తెలిపారు. మండలంలో ‘మనఊరు-మనబడి’ పథ కానికి ఎంపికైన పాఠశాలల్లో పనులను పూర్తి చేయాలన్నారు.