నిజాంపేట, జనవరి 28: మండలంలోని చల్మెడ గ్రామంలో తిరుమలనాథ స్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నారు. తిరుమలనాథ జాతరకు భక్తజనం పోటెత్తారు. ఆలయంలోని గుండంలో భక్తులు స్నానమాచరించి స్వామివారిని దర్శించుకుని, మొక్కు లు తీర్చుకున్నారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం ఆలయంలో ధ్వజారోహణం, మూలమూర్తుల అభిషేకం, స్వామివారి అలంకారం, నైవేద్యం, హారతి స్వామివారి కల్యాణ మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. భక్తులకు అన్నదానం చేశారు. ఆలయ ప్రాంగణంలో వైద్యశిబిరాన్ని ఏర్పాటుచేశారు. జాతరలో ఆటబొమ్మలు, తినుబండారాల దుకాణాలు వెలిశాయి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా తూప్రాన్ డీఎస్పీ యాదగిరిరెడ్డి, ఎస్సై శ్రీనివాస్రెడ్డి ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటుచేశారు.
ప్రత్యేక ఆకర్షణగా ఎండ్లబండ్ల ప్రదక్షిణలు
నందిగామ, చల్మెడ గ్రామాలకు చెందిన రైతులు తమ ఎండ్ల బండ్లతో తిరుమలనాథ స్వామివారి ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేయించారు. ఎండ్లబండ్ల ముందు బైండ్లవారి పాటలు, శివసత్తుల పూనకాలు ఆకట్టుకున్నాయి. తిరుమలనాథ స్వామి జాతరకు నిజాంపేటతో పాటు చల్మెడ, కల్వకుంట, నందిగామ, కోనాపూర్, బీబీపేట, నందగోకుల్, నస్కల్, రాంపూర్, హైదరాబాద్, ఇతర రాష్ర్టాల నుంచి దాదాపుగా 20 వేల మంది భక్తులు తరలివచ్చారు.
పట్టు వస్ర్తాలు సమర్పించిన ఎమ్మెల్యే దంపతులు
తిరుమలనాథ స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా తిరుమలనాథ స్వామివారి కల్యాణానికి విచ్చేసిన ఎమ్మెల్యే పద్మ, ఇఫ్కో డైరెక్టర్ దేవేందర్రెడ్డి దంపతులు పట్టువస్ర్తాలు సమర్పించారు. వారికి వేదబ్రాహ్మణులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ఆలయాల అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నదన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ సిద్ధిరాములు, ఆలయ కమిటీ చైర్మన్ మహేశ్, చల్మెడ సర్పంచ్ నర్సింహరెడ్డి, ఎంపీటీసీ బాల్రెడ్డి, ఉపసర్పంచ్ రమేశ్, ఆయా గ్రామాల సర్పంచులు, కో-ఆప్షన్ సభ్యుడు గౌస్, బీఆర్ఎస్ నాయకులు, ఆలయ కమిటీ సభ్యులు ఉన్నారు.
జెప్తి శివునూర్లో పెద్దమ్మ జాతరలో బోనమెత్తిన ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి
చేగుంట, జనవరి 28: నార్సింగి మండలం జెప్తిశివునూర్లో ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో పెద్దమ్మ దేవాలయ ప్రథమ వార్షికోత్సవంలో మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి శనివారం పాల్గొన్నారు. అనంతరం బోనం ఎత్తుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ ఏర్పాటైన తర్వాత సీఎం కేసీఆర్ అన్ని వర్గాల అభివృద్ధికి కృషి చేస్తున్నారన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ వైస్ చైర్పర్సన్ డీ.సుజాత శంకర్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మైలారం బాబు, పట్లోరి రాజు, సర్పంచ్ షరీఫ్, యాదగిరి, ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు గడ్డం భిక్షపతి, భూదయ్య, కో ఆప్షన్ సభ్యులు బాలమల్లయ్య, పరుశురాములు, జే.సంతోశ్, సిద్ధిరాములు, కమిటీ సభ్యులు జీ.స్వామి, సిద్ధయ్య, టీ.సిద్దయ్య, చిక్కుడు భిక్షపతి, ఆర్ కృష్ణ, పి.చిన్న ఎల్లం, మ్యాకల గట్టు, పెద్ద ఎల్లం, డీ అంజయ్య, భక్తులు పాల్గొన్నారు.