రామాయంపేట, జనవరి 31: పట్టణంలో మల్లికార్జున స్వా మి, రేణుకా ఎల్లమ్మ ఆలయాల్లో ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఉత్సవా ల్లో భాగంగా మంగళవారం ప ట్నాలు గీసి, ఎల్లమ్మ కల్యాణం యాదవ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. అంతకుముందు యా దవులు డోలుచప్పుళ్లతో బోనాలు ఊరేగింపుగా తీసుకువచ్చి అమ్మవారికి సమర్పించారు. సంఘం తరఫున పట్టువస్త్రాలు అందజేశారు.
మల్లన్నకు మందగంపలు..
ఉత్సవాల్లో భాగంగా యాదవ సంఘం కులస్తులు పెద్ద ఎత్తున మల్లన్నకు మందగంపలు ఊరేగింపుగా తీసుకువచ్చి, స్వామివారికి సమర్పించారు. అనంతరం మల్లన్న, ఎల్లమ్మ ఆలయాల చుట్టూ బండ్ల ఊరేగింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. బండ్ల కార్యక్రమం కన్నుల పండువగా సాగింది. ఆలయాల సమీపంలో కళాకారులు మల్లన్న, ఎల్లమ్మ ఒగ్గు కథలు చెప్పగా, భక్తులు ఆసాంతం తిలకిస్తూ విన్నారు. ఈ ఉత్సవాల్లో భక్తులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. రామాయంపేట పట్టణంతో పాటు చుట్టపక్కల గ్రామాల నుంచి వచ్చిన భక్తుల కోసం నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేశారు. జాతర సందర్భంగా ఆలయ సమీపంలో పెద్ద ఎత్తున వివిధ రకాల దుకాణాలు వెలిశాయి. కాగా, తాగునీటితో పాటు వైద్య, ఆరోగ్య సిబ్బందితో క్యాంపును ఏర్పాటు చేశారు. పట్టణ సీఐ చంద్రశేఖర్రెడ్డి, ఎస్సై రంజిత్ ఆధ్వర్యంలో పటిష్ట బందోబస్తు నిర్వహించారు.