మెదక్, జనవరి 1 (నమస్తే తెలంగాణ): కొత్త సంవత్సరం నేపథ్యంలో మెదక్ జిల్లాలో మద్యం విక్రయాలు జోరుగా జరిగాయి. మద్యం ప్రియులు దండిగా మద్యాన్ని కొనుగోలు చేసి తాగేశారు. డిసెంబర్ 31న ఒక్క రోజులో జిల్లా వ్యాప్తంగా రూ.2.85 కోట్ల మద్యాన్ని విక్రయించారు. దీంతో ఎక్సైజ్ శాఖ ఖజానాకు భారీగా ఆదాయం వచ్చి చేరింది.
మెదక్ జిల్లాలో ఒక్క రోజులోనే రూ.2.85 కోట్ల విక్రయాలు
కొత్త సంవత్సరం సందర్భంగా మెదక్ జిల్లాలో రూ.2.85 కోట్ల మద్యం విక్రయాలు జరిగాయి. జిల్లా వ్యాప్తంగా 49 వైన్స్లు, 4 బార్లు ఉన్నాయి. 3,008 కేసుల మద్యం, 1736 కేసుల బీర్లు రూ.2.85 కోట్ల మద్యం విక్రయాలు జరిగాయని ఎక్సైజ్ శాఖ అధికారులు తెలిపారు. డిసెంబర్లో 53,992 కేసుల మద్యం, 67669 బీర్ల కేసులు రూ.52.39 కోట్లు విక్రయాలు జరిగాయని ఎక్సైజ్ శాఖ ఈఎస్ రజాక్ తెలిపారు.