సంగారెడ్డి కలెక్టరేట్, ఏప్రిల్ 11 : మహాత్మా జ్యోతిబాఫూలే జీవితం ఆదర్శనీయమని, ఆయ న ఆదర్శాలు, ఆశయ సాధనకు నేటి యువత నడుచుకోవాలని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. జ్యోతిబాఫూలే 197వ జయంతి సందర్భంగా సంగారెడ్డి జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమశాఖ ఆధ్వర్యంలో మంగళవారం పట్టణంలోని ఆర్ ఆండ్ బీ కార్యాలయం వద్ద ఉన్న పూలే విగ్రహానికి మంత్రి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మంత్రితోపాటు రాష్ట్ర చేనేత, జౌళి శాఖ అభివృద్ధి సంస్థ చైర్మన్ చింతా ప్రభాకర్, జడ్పీ చైర్ పర్సన్ మంజుశ్రీజైపాల్రెడ్డి, జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్, కలెక్టర్ డాక్టర్ శరత్, అదనపు కలెక్టర్ వీరారెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ విజయలక్ష్మి తదితరులు ఫూలే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా జ్యోతిబాఫూలే భవన నిర్మాణానికి కంది మండలంలోని కాశీపూర్లో కేటాయించిన ఒక ఎకరం స్థలానికి సంబంధించిన పత్రాలను బీసీ సంక్షేమ సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి బీరయ్యయాదవ్కు మంత్రి అందజేశారు. అనంతరం కల్వకుంట రోడ్డులో పూలే జయంతిని చింతా ప్రభాకర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సమాజంలో కుల, వర్ణ వివక్షతల నిర్మూలనకు చదువు ఒక్కటే మార్గమని గుర్తించి, ఆ దిశ గా కృషి చేసిన మహానీయుడు పూలే అని పేర్కొన్నారు. అదనపు కలెక్టర్ వీరారెడ్డి మాట్లాడుతూ చరిత్ర తిరగ రా సిన వ్యక్తి ఫూలే అన్నారు. అనంతరం బీసీ గురుకులాలు, హాస్టళ్ల విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమా లు అలరించాయి. కార్యక్రమంలో జిల్లా వెనుక బడిన తరగతుల అభివృద్ధి అధికారి జగదీశ్, డీసీసీబీ వైస్ చైర్మన్ మాణిక్యం, జడ్పీటీసీ సునీతామనోహర్గౌడ్, కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి రమేశ్గౌడ్, రిటైర్డ్ ప్రిన్సిపాల్స్ రాములు, అనంతయ్య, నాయకులు మాణిక్యం, డాక్టర్ కూన వేణు, డాక్టర్ శ్రీహరి, వరలక్ష్మి పాల్గొన్నారు.