అందోల్, నవంబర్ 4 : క్రాంతికిరణ్ విజయం.. పేదప్రజల గెలుపు అని, అందోల్లో మరోసారి గెలిపించుకుందాం.. అభివృద్ధిని సాధించుకుందాం.. అంటూ సంగారెడ్డి జడ్పీ చైర్పర్సన్ మంజుశ్రీజైపాల్రెడ్డి పిలుపునిచ్చారు. శనివారం అందోల్లో యువత ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ మంజుశ్రీజైపాల్రెడ్డి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ రాష్ర్టాన్ని అన్ని రంగాల్లో ఎంతో అభివృద్ధి చేస్తున్నారని, క్రాంతికిరణ్ ఎమ్మెల్యేగా అందోలులో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారన్నారు. తాలెల్మ ఎత్తిపోతల, అందోల్-జోగిపేట రోడ్లు, మున్సిపల్తోపాటు గ్రామాల్లో సీసీరోడ్లు, కమ్యూనిటీ భవనాలు ఇలా ఎన్నో అభివృద్ధి పనులు చేపట్టారని తెలిపారు. మరొక్క సారి ఆయనను భారీ మెజార్టీతో గెలిపించి అందోల్ అభివృద్ధికి బాటలు వేయాలన్నారు. యువత ఎంతో తెలివైనవారని గత ప్రభుత్వాలు, మన ప్రభుత్వం చేపట్టిన పనులను ప్రజలకు అర్థమయ్యే విధంగా వివరించాలని సూచించారు. కాంగ్రెస్, బీజేపీ గెలిచినా ప్రజలకు ఏమీ చేయలేరని విమర్శించారు.
బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే క్రాంతికిరణ్ మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ తనకు మొదటిసారి అవకాశం ఇవ్వగా అందోల్ ప్రజలు ఎంతో ప్రేమను పంచారన్నారు. ఈ రోజు యువ ప్రభంజనం చూస్తుంటే అందోల్లో గెలుపు ఖాయమైందని, మెజార్టీకోసం కృషి చేయాలన్నారు. మీ ప్రేమకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నానని మరో 25రోజులు ఇదే కసితో పనిచేస్తే కేసీఆర్ మళ్లీ సీఎం అవుతారని మనకు ఎలాంటి కష్టాలు ఉండవన్నారు. ఐదేండ్లలో అందోలు నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ధి పను లు చేశామని, ఇంకా చేయాల్సింది చాలా ఉన్నదని, మరొసారి తనకు అవకాశం ఇవ్వాలని కోరారు. కార్పొరేషన్ చైర్మన్లు క్రిశాంక్, గెల్లు శ్రీనివాస్, మఠం భిక్షపతి, మోటివేషన్ స్పికర్, (శ్రీమేథా) చిరంజీవి తమ ప్రసంగాలతో యువతలో మరింత జోష్ నింపారు. కార్యక్రమంలో ఎన్నికల ఇన్చార్జి ఫరూఖ్హుస్సేన్, స్టేట్ మార్క్ఫెడ్ డైరెక్టర్ జగన్మోహన్రెడ్డి, రాష్ట్ర నాయకులు రాహుల్కిరణ్, జైపాల్రెడ్డి, ఏఎంసీ చైర్మన్ సంజీవయ్య, మున్సిపల్ చైర్మన్ మల్లయ్య, వైస్ చైర్మన్ ప్రవీణ్, ఎంపీపీ బాల య్య, వైస్ ఎంపీపీ మహేశ్వర్రెడ్డి, బీఆర్ఎస్ మండలాధ్యక్షులు, యువజన అధ్యక్షులు, సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.
బీజేపీ వాళ్లవి కథలు.. కాంగ్రెసోళ్లవి అబద్ధాలు; స్టేట్ టీఎస్ఎండీసీ చైర్మన్ క్రిశాంక్
దేశాన్ని పాలించిన కాంగ్రెస్, బీజేపీ ప్రజలకు చేసిన ఉపయోగం ఏమీ లేదని? కానీ, తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని విస్మరించి ప్రజలకు అసత్యాలు.. అబద్ధ్దాలు.. కథలు చెబుతారని కార్పొరేషన్ చైర్మన్ క్రిశాంక్ విమర్శించారు. తెలంగాణ ఏర్పాటు తర్వాతే యువత బతుకులు బాగుపడ్డాయని… కాంగ్రెస్, బీజేపీ మాటలు వింటే ఆగం అవుతామన్నారు. సోషల్మీడియా వారియర్స్ ప్రభుత్వం, ఎమ్మెల్యే క్రాంతికిరణ్ చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రజలకు వివరించాలన్నారు.
లక్ష ఉద్యోగాలు భర్తీ చేస్తాం : గెల్లు శ్రీనివాస్యాదవ్
నీళ్లు.. నిధులు.. నియామకాల కోసం కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో లక్ష ఉద్యోగాలు కల్పించిన ఘనత సీఎం కేసీఆర్దని, యువతకు ఉపాధి కల్పించాలన్న చిత్తశుద్ధి ఉన్న ఏకైక నాయకుడు కేసీఆర్ అని టీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్యాదవ్ అన్నారు. సీఎం కేసీఆర్ పదేండ్లుగా యువతకు అన్నిరం గాల్లో ఉపాధి కల్పిస్తున్నారన్నారు. యువత సౌమ్యుడు, మంచి మనిషి క్రాంతికిరణ్ను గెలిపించాలన్నారు.
స్థానికుడిని గెలిపించాలి : ‘ట్రేడ్’ కార్పొరేషన్ చైర్మన్ మఠం భిక్షపతి
అందోల్ను అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తున్న స్థానికుడు క్రాంతికిరణ్ ను గెలిపించుకుని మన ప్రాంతాన్ని మరింత అభివృద్ధి చేసుకుందామ న్నారు. యువత ప్రభుత్వ పథకాలు, మ్యానిపెస్టోపై విస్తృతంగా ప్రచారం చేపట్టి భారీ మెజార్టీ వచ్చేలా కృషి చేయాలన్నారు.
గులాబీమయమైన అందోలు-జోగిపేట
అందోలు-జోగిపేటలో నిర్వహించిన యువ అత్మీయ సమ్మేళనానికి వేలాదిగా యువత తరలివచ్చి బీఆర్ఎస్ అభ్యర్థి చంటి క్రాంతి కిరణ్కు మద్దతుగా నిలిచారు. నియోజకవర్గ వ్యాప్తంగా 8 కిలోమీటర్ల వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు.