మెదక్ అర్బన్, డిసెంబర్ 19 : లీగల్ ఎయిడ్ ద్వారా ఉచిత న్యాయ సహాయం, సలహాలు ఇవ్వనున్నట్లు జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ న్యాయమూర్తి జితేందర్ తెలిపారు. మంగళవారం జిల్లా న్యాయస్థానం సముదాయంలో ప్యానెల్ లాయర్స్, లీగల్ ఎయిడ్ న్యాయవాదులకు విధులపై మానిటరింగ్ కమిటీ సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా న్యాయమూర్తి మాట్లాడుతూ లీగల్ ఎయిడ్ ద్వారా బాధితులకు న్యాయ సహాయం అందించాలన్నారు. ఈ నెల 30 నిర్వహించే జాతీయ లోక్ అదాలత్లో రాజీ కుదుర్చుకునే కేసుల్లో రాజీ మార్గం ద్వారా అధిక సంఖ్యలో కేసులను కక్షిదారులు కేసులను పరిష్కరించుకునేలా చూడాలని సూచించారు. కార్యక్రమంలో న్యాయవాదులు పాల్గొన్నారు.