సిద్దిపేట, ఏప్రిల్ 15: పాత కలెక్టరేట్ భవనాన్ని అంబేద్కర్ భవన్గా మార్చి అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.కోటి నిధులు మంజూరు చేయడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో సిద్దిపేట పట్టణంలోని అంబేద్కర్ భవన్ (ఓల్డ్ కలెక్టరేట్)లో దళిత సంఘాల ఆధ్వర్యంలో శనివారం సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్రావు ఫ్లెక్సీకి క్షీరాభిషేకం నిర్వహించారు.
ఈ సందర్భంగా దళిత సంఘాల నాయకులు మాట్లాడుతూ.. దళిత పక్షపాతిగా దళితుల అభివృద్ధికి సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్రావు అహర్నిశలు కృషి చేస్తున్నారన్నారు. అంబేద్కర్ భవన్ అభివృద్ధికి నిధులు కేటాయించడంపై వారు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు సాకి ఆనంద్, గ్యాదరి రవీందర్, మాల ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు గ్యాదరి రామస్వామి, మాల సదార్ సంఘం అధ్యక్షుడు తండ భూమయ్య, కుల సంఘం పెద్దలు గ్యాదరి మహంకాళి, బీఆర్ఎస్ నాయకులు బత్తుల శ్రీనివాస్, గ్యాదరి భూమలింగం, జక్కుల రాజు, కుల సంఘం సభ్యులు పాల్గొన్నారు.