మెదక్, జూన్ 6 (నమస్తే తెలంగాణ): తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బంగారు తెలంగాణగా తీర్చిదిద్దుకునే క్రమంలో నీటి పారుదల, ఆయకట్టు అభివృద్ధి శాఖ లభ్యమవుతున్న నీటి వనరులను ఉపయోగించుకుంటున్నది. ఇటు వ్యవసాయం, అటు పారిశ్రామిక రంగాన్ని పటిష్టం చేసుకుంటూ, తాగునీటిని సమకూర్చడానికి కృషి చేస్తున్నది. దీనికి గానూ మన లక్ష్యాన్ని సాధించడానికి వివిధ సాగునీటి ప్రాజెక్టులను అమలు చేయడంలో ఈ శాఖ ముఖ్యభూమిక పోషిస్తున్నది.
సాగునీటి శాఖ ప్రధాన విధులు
మధ్యతరహా ప్రాజెక్ట్
కాళేశ్వరం ప్రాజెక్ట్
భూగర్భ జలాల నివేదిక
తెలంగాణప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులతో మెదక్ జిల్లాలో భూగర్భ జలాలు 2014 నుంచి 2023 వరకు సరాసరి పెరిగాయి. ఎండా కాలం లో 0.72 మీటర్లు, వానకాలంలో 8.91 మీటర్లు గణనీయంగా పెరిగి జిల్లాలో రైతులకు ఇబ్బంది లేకుండా పంటలు పండుతున్నాయి.
ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్సు..
చెరువుల ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్సులో భాగంగా 115 చెరువులను వర్షాకాలంలో పడిన బుంగలు, ఇతర వరదల వల్ల జరిగిన నష్టాలను అధిగమించి, అధికమొత్తంలో నిధులు సమకూర్చి చెరువులకు మరమ్మతుల చేసి పంటలను కాపాడడమైనది. అలాగే తెలంగాణ ఏర్పడిన తర్వాత నీటి పారుదల శాఖకు రూ.2398 కోట్ల 29 లక్షల నిధులు మంజూరు చేసి ఆ నిధులతో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులతో మెదక్ జిల్లాలో ఆయకట్టు సాగు పెరిగి పంట ఉత్పత్తి గణనీయంగా పెరిగింది.
శాఖ వ్యవస్థీకృత ఏర్పాటు..
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అవసరాలకు అనుగుణంగా ప్రభుత్వ విధానాల ప్రకారం ప్రస్తుతమున్న యూనిట్లను సృష్టించారు. అలాగే సాగునీటి, సీఏడీ డిపార్టుమెంటును బలోపేతం చేశారు.
మెదక్ జిల్లాలో ప్రాజెక్టులు
నాడు
1 వనదుర్గా ప్రాజెక్టు నుంచి సాగునీరు విడుదల చేయాలని, సింగూరు నుంచి నీటి విడుదల కోసం రైతులు, ప్రజాప్రతినిధులు రోడ్డు ఎకి ధర్నాలు చేసిన పరిస్థితి.
2 సింగూరు నుంచి తకువ పరిణామం, తకువ ఆయకట్టుకు సాగునీటిని విడుదల చేసేవారు.
3 వనదుర్గ ప్రాజెక్టులో తకువ పరిణామంలో వానకాలం తకువ పంట సాగు అయ్యేది.
4 40 సంవత్సరాలుగా వనదుర్గ ఆయకట్టులో పదివేల ఎకరాలు సాగు చేయడం జరుగుతుంది.
5 కాలువల ఆధునీకరణకు గానీ ఎటువంటి మరమ్మతులకు నిధులు కేటాయించ లేదు.
6 ఆయకట్టులో రైతుల ఆర్థిక స్థితిగతులు, జీవన ప్రమాణాలు సరిగ్గా ఉండేవి కావు. దీంతో చాలామంది రైతులు వలస వెళ్లేవారు.
7 ఆయకట్టుకు నీరు విడుదల సరిగా లేకపోవడం వల్ల భూముల విలువ తకువగా ఉండేవి
8 ఆయకట్టు పరిధిలో నీటి సరఫరా తకువగా ఉండడం వల్ల భూగర్భ జలాలు తకువగా ఉండేది.
నేడు
1 తెలంగాణ ఏర్పడిన తర్వాత సాగునీటి అవసరం ఎప్పుడు ఉన్నా సింగూరు ప్రాజెక్టు నుంచి విడుదల చేస్తున్నారు. దాని కోసం ఎటువంటి ధర్నాలు చేయాల్సిన పరిస్థితి లేదు.
2 సింగూరు ప్రాజెక్టు నుంచి వనదుర్గా ఆయకట్టు అవసరాల మేరకు పూర్తి మేర నీటిని ఎప్పుడు అవసరమైతే అప్పుడు వదులుతున్నారు.
3 నేడు రెండు దఫాలుగా వానకాలంలో చివరి ఆయకట్టు వరకు పూర్తిస్థాయిలో నీటిని వదులుతున్నారు.
4 తెలంగాణ ఏర్పడిన తర్వాత ఎనిమిది సంవత్సరాలుగా రెండు పంటలకు పూర్తిస్థాయి ఆయకట్టు 21వేల 625 ఎకరాల సాగు చేస్తున్నారు. దానికి అదనంగా 5వేల ఎకరాలు సాగు చేస్తున్నారు.
5 వనదుర్గ ప్రాజెక్టు ఎత్తు పెంపునకు రూ.43 కోట్ల 66 లక్షలు, కాలువల ఆధునీకరణకు రూ.97 కోట్ల 60 లక్షలు కేటాయించారు.
6 రైతుల జీవన ప్రమాణాలు, ఆర్థిక స్థితిగతులు మెరుగుపడి వలసలు పూర్తిగా తగ్గాయి.
7 8 సంవత్సరాలుగా క్రమంతప్పకుండా నీటిని విడుదల చేయడం వల్ల భూమి విలువ పెరిగింది. ఆయకట్టు రైతులు ఎవ్వరూ కూడా వలసలు దాఖలాలు లేవు
8 తెలంగాణ ఏర్పాడిన తర్వాత రెండు దఫాలుగా నీరు సరఫరా చేయడం వల్ల భూగర్భ జలాలు గణనీయంగా పెరిగాయి
కాళేశ్వరం ప్రాజెక్టు
నాడు
1 మెదక్ జిల్లాలో స్థిరమైన నీటి సరఫరా చేయడానికి సరైన నీటి పారుదల ప్రాజెక్టు లేదు.
2 మెదక్ జిల్లాలో ఎటువంటి భారీ నీటిపారుదల ప్రాజెక్టు ఉండేది కాదు. దీంతో రైతులు పంటలు పండక ఇబ్బంది పడేవారు.
నేడు
1 కొండపోచమ్మ జలాశయం ద్వారా అవసరమైనప్పుడు అవసరమైనంత మేర నీటిని విడుదల చేసి చెక్డ్యాంలు నింపి ఎండిపోయే పంటలు కాపాడుతున్నారు.
2 మెదక్ జిల్లాలో కొండపోచమ్మ జలాశయం కాలువలు, మల్లన్నసాగర్ కాలువలు వస్తున్నాయి. తద్వారా జిల్లా మొత్తం సస్యశ్యామలం కానున్నది.