కొండపాక, ఆగస్టు 6 : పరిపాలనా సౌల భ్యం కోసమే కొత్త మండలం ఏర్పాటు అవుతుందని ఎంపీటీసీ ఫోరం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ దేవీరవీందర్ అన్నారు. శనివారం లకుడారం గ్రామ శివారులో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కుకునూరుపల్లి ప్రాంత గ్రామాల ప్రజలకు కొండపాక మండల కేంద్రం దూరంగా ఉండడంతో వ్యయ ప్రయాసలకు గురయ్యారన్నారు.
ఈ విషయాన్ని సీఎం కేసీఆర్ మంత్రి హరీశ్రావు దృష్టికి తీసుకువెళ్లి కుకునూరుపల్లిని మండలంగా ఏర్పాటు చేయాలని పలుమా ర్లు విజ్ఞప్తి చేయడంతో ప్రభుత్వం కొత్త మం డలం ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చిందని తెలిపారు. ఈ ప్రాంత ప్రజల చిరకాల ఆకాంక్షను నెరవేర్చిన సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్రావు, ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డికు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఏగొండస్వా మి, రాజు, అనిల్ పాల్గొన్నారు.