చేర్యాల, మార్చి 11: కొమురవెల్లి మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాల 8వ ఆదివారం రూ.55,18,026 ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈవో బాలాజీ, ఆలయ పునరుద్ధరణ కమిటీ చైర్మన్ పర్పాటకం లక్ష్మారెడ్డి తెలిపారు. శుక్ర(మహాశివరాత్రి), శని, ఆదివారాల్లో ఆర్జిత సేవలు, గదులు, దర్శనాలు, ప్రసాదాల విక్రయం తదితర వాటిద్వారా ఈ ఆదాయం వచ్చిందన్నారు.
మహాశివరాత్రి రోజున రూ.16,54,043, శనివారం రూ.16, 11,232, ఆదివారం రూ.22,52,751 వచ్చినట్లు పేర్కొన్నారు. ఆలయ ఏఈవో బుద్ధి శ్రీనివాస్, సూపరింటెండెంట్ నీల శేఖర్, ఆలయ ప్రధానార్చకుడు మహాదేవుని మల్లికార్జున్, ఆలయ కమిటీ సభ్యులు, అర్చకులు, ఒగ్గు పూజారులు, సిబ్బంది ఉన్నారు.