చేర్యాల, జనవరి 9 : కొమురవెల్లి మల్లికార్జునస్వామి కల్యాణోత్సవం సందర్భంగా ఆర్జిత సేవల ద్వారా మల్లన్న ఖజానాకు రూ.23,50,333 ఆదాయం వచ్చినట్లు మంగళవారం ఆలయవర్గాలు తెలిపాయి. కల్యాణ మహోత్సవం ప్రారంభం రోజు శనివారం రూ. 1,85,356, ఆదివారం రూ.18, 74, 449, సోమవారం రూ.2,90,528 ఆదాయం బుకింగ్, పులిహోర, లడ్డూ ప్రసాదం విక్రయాలు, దర్శనం టికెట్ల విక్రయం, ఎల్లమ్మ ఆలయం వద్ద మొక్కుల రూపంలో, గదుల కిరాయిలు, అన్నదానంలో దాతల విరాళం, తలనీలాలు, మొక్కులు తదితర వాటి ద్వారా ఆదాయం రూ. 23,50,333 వచ్చినట్లు పేర్కొన్నారు.
మూడు రోజుల పాటు కొనసాగిన కల్యాణ మహోత్సవానికి భారీగా భక్తులతో పాటు వీవీఐపీలు, వీఐపీలు, ప్రజాప్రతినిధులు తరలిరావడంతో ఆదాయం వచ్చిందన్నారు.