చేర్యాల, ఫిబ్రవరి 6: సిద్దిపేట జిల్లాలోని కొమురవెల్లి మల్లికార్జునస్వామి మూడో ఆదివారం సందర్భంగా రూ.55,70,464 ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈవో ఎ.బాలాజీ, పునరుద్ధరణ కమిటీ చైర్మన్ పర్పాటకం లక్ష్మారెడ్డి తెలిపారు. మంగళవారం వారు విలేకరులతో మాట్లాడుతూ ఆర్జిత సేవలు, గదులు, దర్శనాలు, ప్రసాదాల విక్రయం తదితర వాటి ద్వారా శనివారం రూ.3,69,032, ఆదివారం రూ.45,65, 237, సోమవారం రూ.6,36,195 ఆదాయం వచ్చిందన్నారు.
గతేడాదితో పోల్చితే ఈసారి రూ.1 7,70,724 అదనంగా ఆదాయం వచ్చిందన్నారు. ఆయనతోపాటు ఆలయ ఏఈవో గంగా శ్రీనివాస్, సూపరింటెండెంట్ నీల శేఖర్, ఆలయ ప్రధానార్చకుడు మహాదేవుడి మల్లికార్జున్, కమిటీ సభ్యులు, అర్చకులు, ఒగ్గు పూజారులు, సిబ్బంది ఉన్నారు.