దోమకాటుతోనే డెంగ్యూ
పరిసరాలు పరిశుభ్రంగా ఉంటే దోమలు దరిచేరవు
గ్రామీణ ప్రాంతాల్లో అవగాహన
జోనల్ మలేరియా అధికారి డాక్టర్ సునీల్ కుమార్
రామయంపేట, మే16: డెంగ్యూ మహమ్మారిని తరిమికొట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని వైద్య ఆరోగ్య శాఖ జోనల్ మలేరియా అధికారి డాక్టర్ సునీల్ కుమార్, జిల్లా వైద్యాధికారి వెంకటేశ్వర్రావు అన్నారు. సోమవారం ప్ర పంచ జాతీయ డెంగ్యూ దినోత్సవ సందర్భంగా రామాయంపేటలో వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది పట్టణంలో పెద్ద ఎత్తున ర్యాలీ తీశారు. ర్యాలీలో మలేరియా జోనల్ అధికారి సునిల్కుమార్, డీఎంఅండ్హెచ్వో వెంకటేశ్వర్రావు పాల్గొన్నారు. అనంతరం ఎంపీడీవో కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేసి ఏఎన్ఎం, ఆశ వర్కర్లు, సూపర్వైజర్లకు డెంగ్యూపై అవగాహన కల్పించారు. గ్రామీణ ప్రాంతాల్లో తిరిగే ఆశవర్కర్లు ప్రతి ఇంటికీ వెళ్లి డెంగ్యూ నివారణ పరీక్షలను చేయాలని సూచించారు. ప్రతి ఇంటికి దోమలు రాకుండా దోమతెరలను అందించాలన్నారు. వారి ఇంట్లో నీరు నిల్వ ఉంటే వెంటనే ఆ నీటిని తొలగించి శుభ్రంగా ఉన్న నీటిని చేర్చుకోవాలన్నారు.
రెండు సంవత్సరాల క్రితం డెంగ్యూ వ్యాధి బాగా ఉండేదని, ప్రస్తుతం మెదక్ జిల్లాలో ఒకటి మాత్రమే డెంగ్యూ వ్యాధి నమోదు అయిందన్నారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవడంతో పాటు ఉండే ఆహారమే తినాలన్నారు. జ్వరం వచ్చిన వారు డెంగ్యూ రావచ్చనే భయాన్ని వీడాలన్నారు. జ్వరం రావడంతోనే ముందుగా దవాఖానకు వెళ్లి రక్త, మూత్ర పరీక్షలు చేయించుకోవాలన్నారు. అనవసరంగా డెంగ్యూ వచ్చిందని ఆందోళనకు గురికావద్దని పేర్కొన్నారు. డెంగ్యూ నివారణకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందన్నారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ మలేరియా అధికారి నాగయ్య, రామాయంపేట ఎంపీడీవో, యాదగిరిరెడ్డి, జిల్లా మాస్ మీడియా అధికారి పాండు రంగాచారి, కుమారస్వామి, ప్రభుత్వ వైద్యురాలు ఎలిజబెత్రాణి, రవీందర్, శ్రీనివాస్, పీహెచ్ఎన్ఎం. సత్తమ్మ, హెచ్ఈవో కరిపె రవీందర్, సూపర్వైజర్లు సునంద, శ్యామల, ఉజ్వల, పాకాల వెంకటేశ్వర్రావు, వైద్య సిబ్బంది ఉన్నారు.
జాతీయ డెంగ్యూ నివారణపై అవగాహన
తూప్రాన్, మే 16: జాతీయ డెంగ్యూ నివారణపై సోమవారం తూప్రాన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుంచి బస్టాండ్ వరకు అవగాహన ర్యాలీ నిర్వహించారు. అనంతరం ప్రాథమిక ఆరోగ్యకేంద్రం ఆవరణలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా వైద్యాధికారిణి డాక్ట ర్ అరుణ, మండల వైద్యధికారి డాక్టర్ ఆనంద్లు మాట్లాడుతూ డెంగ్యూ కేసులు తక్కువగా ఉన్నప్పటికీ ప్రజ లు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వ్యక్తిగత శుభ్రతతో పాటు పరిసరాల పరిశుభ్రత, తాగునీటి వనరుల శుభ్రత పాటించాలన్నారు. కార్యక్రమంలో వైద్య సిబ్బంది బాల్నర్సయ్య, శ్రీనివాస్రెడ్డి, దుర్గారెడ్డి, సూపర్వైజర్లు పల్లవి, శారద, ఏఎన్ఎంలు, ఆశ వర్కర్లు పాల్గొన్నారు.