హుస్నాబాద్, మార్చి 12: కరీంనగర్లో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన కరీంనగర్ కదనభేరి సభకు హుస్నాబాద్ నుంచి అధిక సంఖ్యలో పార్టీ శ్రేణులు మంగళవారం బయలుదేరి వెళ్లారు. బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలతో పాటు మ హిళలు, యువకులు వివిధ వాహనాల్లో జై తెలంగాణ నినాదాలు చేస్తూ సభకు చేరుకున్నారు.
హుస్నాబాద్ నియోజకవర్గంలోని హుస్నాబాద్, అక్కన్నపేట, కోహెడ, చిగురుమామిడి, సైదాపూర్, ఎల్కతుర్తి, భీమదేవరపల్లి మండలాల నుంచి అధిక సంఖ్యలో కరీంనగర్ సభకు వెళ్లారు. మాజీ ఎమ్మెల్యే వొడితెల సతీశ్కుమార్, హనుమకొండ జిల్లా పరిషత్ చైర్మన్ డాక్టర్ సుధీర్కుమార్, సిద్దిపేట జడ్పీ వైస్చైర్మన్ రాజిరెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ ఆకుల రజితావెంకట్, ఆయా మండలాల ఎంపీపీలు, జడ్పీటీసీలు, పార్టీ మండల అధ్యక్షులు, గ్రామశాఖ అధ్యక్షుల ఆధ్వర్యంలో సభకు తరలివెళ్లారు.