‘చేను తెల్వది.. చెల్క తెల్వది, నాగలి తెల్వది.. కర్రు తెల్వని మైనంపల్లి రోహిత్కు బతుకమ్మ అంటే కూడా తెల్వది. తెలంగాణ సంస్కృతిలో భాగమైన బతుకమ్మ అంటే మా ఆడపడుచులు ఆడే ఆట.. మహిళలు ఆరాధించే గొప్ప పండుగ. బతుకమ్మ ఆడితే రోహిత్ విమర్శించడం మంచి పద్ధతి కాదు. కాంగ్రెస్ అంటేనే కరెంట్ కష్టాలు.. మోటర్లు, మీటర్లు కాలిపోవుడే.. సంక్షేమం గురించి ఏం తెలుసని మైనంపల్లి రోహిత్కు ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి చల్మెడ గ్రామ వేదికగా వార్నింగ్ ఇచ్చారు.’ సోమవారం ఎన్నికల ప్రచారంలో భాగంగా నిజాంపేట మండలంలో ఆమె ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా మైనంపల్లి హన్మంతరావు, ఆయన కుమారుడు రోహిత్ తీరును ఆమె ఎండగట్టారు.
నిజాంపేట, నవంబర్ 20: ఎన్నికల వేళ బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నాయకులు చెబుతున్న మాయమాటలను ప్రజలు నమ్మొద్దని మెదక్ బీఆర్ఎస్ అభ్యర్థి పద్మాదేవేందర్రెడ్డి అన్నారు. సోమవారం ఎన్నికల ప్రచారంలో భాగంగా నిజాంపేట మండలంలోని చల్మెడ, నందిగామ, బచ్చురాజ్పల్లి, షౌకత్పల్లి, తిప్పనగుల్ల, వెంకటాపూర్(కె), రజాక్పల్లి, ఖాసీంపూర్ గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారంలో ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డికి మహిళలు, బీఆర్ఎస్ శ్రేణులు అప్యాయంగా పలకరించి, ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పద్మాదేవేందర్రెడ్డి మాట్లాడుతూ రైతులు ఆర్థికంగా బాగుపడాలని సీఎం కేసీఆర్ వ్యవసాయానికి 24 గంటల నాణ్యమైన కరెంట్ ఇస్తుంటే, మూడు గంటల కరెంటే సరిపోతుందని పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి మాట్లాడడం రైతులను ఆగౌరపర్చినట్లని అన్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనకు సీఎం కేసీఆర్, తామందరం నాడు జై తెలంగాణ అని అంటే మైనంపల్లి నై తెలంగాణ అన్నాడని గుర్తుచేశారు. ప్రశాంతమైన మెదక్ నియోజకవర్గంలో గొడవలు సృష్టిస్తున్నాడని విమర్శించారు. 11 ఏండ్ల పాటు గెలిచిన కాంగ్రెస్ రైతులను ఏమాత్రం పట్టించుకోలేదని, కాంగ్రెస్ అంటేనే కరెంట్ కష్టాలని, మోటర్లు, మీటర్లు కాలిపోవుడేనని అన్నారు. రైతు సంక్షేమం కోసం అమలవుతున్న రైతుబంధు పథకాన్ని ఆపేయాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈసీకి ఫిర్యాదు చేయడం ఎంతవరకు సమంజసమని మండిపడ్డారు. 93 లక్షల మందికి రైతు బీమా తరహాలో ఇంటింటికీ బీమా కేసీఆర్ ధీమా పథకాన్ని సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టారని, తెల్లరేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికీ సన్నబియ్యం, రూ.400లకే గ్యాస్ సిలిండర్ అందజేస్తామని తెలిపారు. బీఆర్ఎస్ అంటేనే మూడు పంటల ప్రభుత్వమని, కారు గుర్తుకు ఓటు వేసి తనను ఎమ్మెల్యేగా గెలిపించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి పద్మాదేవేందర్రెడ్డి ప్రజలను కోరారు.
బతుకమ్మ ఆట అంటే తెలంగాణ సంస్కృతిలో ఒక భాగం. ఆడపడుచులంతా సరదాగా ఆడే ఆట బతుకమ్మ. ప్రచారంలో భాగంగా మా ఆడపడుచులతో బతుకమ్మ ఆడితే రోహిత్ విమర్శించడం మంచి పద్ధతి కాదని మైనంపల్లి రోహిత్కు ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి చల్మెడ గ్రామ వేదికగా వార్నింగ్ ఇచ్చారు. రెండుసార్లు ఎమ్మెల్యే గెలిచిన హన్మంత్రావు మెదక్కు ఏం చేశారని ప్రశ్నించారు. నాలుగు దఫాలుగా ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు చూశానని, ఎన్నడూ ఇలాంటి ఘటనలు జరుగలేవన్నారు. ఓటమి భయంతోనే కాంగ్రెస్ పార్టీ నాయకులు కక్ష్య పూరితంగా దాడులకు పాల్పడుతున్నారన్నారు. ప్రజలే వీరికి ఓటు రూపంలో తగిన గుణపాఠం చెబుతారన్నారు. ప్రచారంలో ఎంపీపీ సిద్ధిరాములు, వైస్ ఎంపీపీ అందె ఇందిరా కొండల్రెడ్డి, మాజీ జడ్పీటీసీ విజయలక్ష్మి, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు సుధాకర్రెడ్డి, యూత్ మండల అధ్యక్షుడు రాజు, సర్పంచులు అనూష, కవిత, ప్రీతి, నర్సవ్వ, అరుణ్కుమార్, గేమ్సింగ్, నర్సింహారెడ్డి, చంద్రవర్ధిని, అనిల్కుమార్, ఎంపీటీసీలు లహరి, బాల్రెడ్డి, సురేశ్, మండల కో-ఆప్షన్ సభ్యుడు గౌస్, కల్వకుంట, నిజాంపేట పీఏసీఎస్ చైర్మన్లు అందె కొండల్రెడ్డి, బాపురెడ్డి, రైతు బంధు సమితి జిల్లా డైరెక్టర్ భాస్కర్రావు, సోషల్ మీడియా మండల అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్, మాజీ ఎంపీపీ సంపత్, రజక సంఘం జిల్లా అధ్యక్షుడు సంగుస్వామి, తిరుమల ఆలయ కమిటీ చైర్మన్ మహిపాల్, ఏఎంసీ డైరెక్టర్లు వెంకటేశం, రవి, చల్మెడ మాజీ ఎంపీటీసీ నాళం కిష్టాగౌడ్, బీఆర్ఎస్ నాయకులు లక్ష్మీనర్సింహులు, సత్యనారాయణ, సుధాకర్, సుభాశ్, నాగరాజు, పర్శాగౌడ్, రాజు, రంజిత్, లక్ష్మణ్, మహేశ్, నగేశ్, దయాకర్, ధర్మరెడ్డి, దుబ్బరాజు, శ్రీనివాస్, ఎల్లం తదితరులు పాల్గొన్నారు.