కంది, అక్టోబర్ 17: తెలంగాణ ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నదని రాష్ట్ర చేనేత అభివృద్ధి సంస్థ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ అన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో అమలవుతున్న సంక్షేమ పథకాలకు ప్రజలు నీరాజనాలు పలుకుతున్నారన్నారు. కంది మండలంలోని బేగంపేటకు చెందిన కాంగ్రెస్ నాయకులు టీఆర్ఎస్ (బీఆర్ఎస్)లో సోమవారం చేరారు.
టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మధుసూదన్రెడ్డి, ఆత్మ కమిటీ చైర్మన్ కృష్ణాగౌడ్, సీనియర్ నాయకుడు సాయగౌడ్ ఆధ్వర్యంలో 50మంది టీఆర్ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. వీరికి చింతా ప్రభాకర్ టీఆర్ఎస్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని వర్గాలకు సమ ప్రాధాన్యతనిస్తూ ప్రజల మన్ననలు పొందుతున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వమన్నారు.
మునుగోడులో టీఆర్ఎస్కు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని, భారీ మెజార్టీతో విజయం ఖాయమన్నారు. కార్యక్రమంలో నాయకులు మోహన్రెడ్డి, రామకృష్ణరెడ్డి, శ్రీనివాస్గౌడ్, వేణుగౌడ్, ఎల్లాగౌడ్, వెంకటేశ్, అనిల్గౌడ్, మనోజ్గౌడ్, వీరేశంగౌడ్, శ్రీకాంత్నాయక్, రమేశ్, శేఖర్, శివగౌడ్, తరుణ్, వెంకట్, సతీశ్, బంటు రాజు, సత్తి తదితరులు పాల్గొన్నారు.