మెదక్, ఫిబ్రవరి 3 : మెదక్ జిల్లాలో కాళేశ్వరం పనులకు సంబంధించి భూ సేకరణ పనుల్లో వేగం పెంచాల ని అదనపు కలెక్టర్ రమేశ్ అన్నారు. గురువారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో నీటి పారుదల శాఖ, రెవె న్యూ శాఖల అధికారులతో కాళేశ్వరం ప్రాజెక్టు పనుల పురోగతి, భూ సేకరణ తదితర అంశాలపై ఆయన సమీ క్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడా రు. జిల్లాలో కాళేశ్వరం ప్రాజెక్టు పనులకు సంబంధించి భూ సేకరణ సర్వే తదితర పనులను వెంటనే పూర్తి చే యాలన్నారు. ఈ విషయంలో ఏ మాత్రం నిర్లక్ష్యం పనికిరాదన్నారు. జిల్లా ప్రజలకు కాళేశ్వరం నీటిని అందించేందుకు పనులు చేపడుతున్నందున ఆయా ప్రాంతాల్లో అప్పటి వరకు అవసరమున్న భూమికి ఎంత భూమికి సేకరించారని అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఇప్పటి వరకు కొన్ని ప్రాంతాల్లో భూ సేకరణ జరగకపోవడం, ఇతర ఏమైనా ఇబ్బందులు ఉంటే వాటిని సామరస్యపూర్వకంగా పరిష్కరించి, వీలైనంత త్వరగా భూ సేకరణ పూర్తి చేసి, పనులు ప్రారంభించేలా చర్యలు తీ సుకోవాలని సూచించారు. అలాగే సర్వే పనులు సైతం ఇంకా పూర్తి కాలేదని, ఆ పనులు కూడా వెంటనే పూర్తి చేసి పూర్తి నివేదికను అందజేయాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా సర్వే అధికారి గంగయ్య, మెదక్, తూ ప్రాన్, నర్సాపూర్ ఆర్డీవోలు సాయిరాం, శ్యాంప్రకాశ్, వెంకట ఉపేందర్రెడ్డి, నీటి పారుదల శాఖ అధికారులు, రెవెన్యూ శాఖల అధికారులు, ఆయా శాఖల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.