గజ్వేల్, డిసెంబర్15: ఈ నెల 26 నుంచి 30వ తేదీ వరకు కేరళలో జరిగే జాతీయస్థాయి జూనియర్ బేస్బాల్ పోటీలకు తెలంగాణ బాలబాలికల జట్లను నిర్వాహకులు ఎంపిక చేశారు. గజ్వేల్ పట్టణంలోని మహతి విద్యానికేతన్లో 30వ జాతీయ స్థాయి జూనియర్ బాలబాలికల బేస్ బాల్ క్రీడా ఎంపిక పోటీలు గురువారం నిర్వహించారు. వివిధ జిల్లాలో నుంచి 150మంది క్రీడాకారులు ఈ ఎంపిక పోటీల్లో పాల్గొన్నారు. ఎంపిక పోటీలను ఎమ్మెల్సీ డాక్టర్ యాదవరెడ్డి, మున్సిపల్ చైర్మన్ ఎన్సీ రాజమౌళి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బేస్బాల్ క్రీడాకారులు జాతీయ స్థాయిలో రాష్ర్టాన్ని మొదటిస్థానంలో నిలబెట్టేందుకు శక్తివంచన లేకుండా కృషి చేయాలని విద్యార్థులకు సూచించారు.
ఉదయం నుంచి సాయంత్రం 6.30గంటల వరకు కొనసాగిన ఈ క్రీడాపోటీల్లో బాలికల జట్టుకు 36మంది, బాలుర జట్టుకు 36మందిని ఎంపిక చేశామని, వీరందరూ జాతీయస్థాయి బేస్బాల్ పోటీల్లో పాల్గొంటారని తెలంగాణ రాష్ట్ర బేస్బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు చల్లా హరిశంకర్, జనరల్ సెక్రటరీ మల్లేశ్యాదవ్, స్టేట్ అబ్జర్వర్ శివకుమార్ తెలిపారు. కార్యక్రమంలో సిద్దిపేట జిల్లా యువజన అధికారి నాగేందర్, బేస్బాల్ అసోసియేషన్ సిద్దిపేట జిల్లా చైర్మన్ వెంకట్రెడ్డి, ప్రెసిడెంట్ రంగారెడ్డి, జనరల్ సెక్రటరీ మధు, నాయకులు సమీర్, మహతి విద్యానికేతన్ పాఠశాల కరస్పాండెంట్ గోపినాథ్శర్మ, ప్రిన్సిపాల్ షబానా ముంతాజ్, వైస్ ప్రిన్సిపాల్ శశిధరశర్మ, ఈవెంట్ ఆర్గనైజర్ విజయ్కుమార్, పీఈటీలు విజయరేఖ, రాజశేఖర్రెడ్డి, రమేశ్, వెంకటేశ్వర్లు, కృష్ణ, మహేశ్, ఆంజనేయులు, అపర్ణ, మమత, సీనియర్ క్రీడాకారులు పాల్గొన్నారు.