వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయం కోసం కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని హ్యాండ్లూమ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ చింతా ప్రభాకర్ అన్నారు. సదాశివపేటలో మంగళవారం నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనానికి ఆయన హాజరై మాట్లాడారు. సీఎం కేసీఆర్ హయాంలోనే తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి ప్రస్తుత ప్రగతిపై గల్లీ గల్లీలో చర్చ పెట్టి ఇంటింటికీ వివరించాలన్నారు. పటాన్చెరు మండలం పాటి గ్రామంలో ఆత్మీయ సమ్మేళనంలో ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి పాల్గొని, పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. సీఎం కేసీఆర్ ఆశీస్సులతో నియోజకవర్గంలో రూ. వేలాది కోట్లతో పనులు జరిగాయన్నారు. రూ.300 కోట్లతో సూపర్ స్పెషాలిటీ దవాఖాన మంజూరు అయిందని గుర్తుచేశారు. మిషన్ భగీరథతో గడపగడపకూ తాగునీరందిస్తున్నామని, రైతులకు వ్యవసాయం పండుగలా మారిందన్నారు. ఈ సందర్భంగా లక్డారం గ్రామానికి చెందిన వందమంది వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు ఎమ్మెల్యే సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు.
– పటాన్చెరు/ సదాశివపేట, మార్చి 28
గులాబీ వనాలు గుభాళిస్తున్నాయి..! మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆత్మీయ సమ్మెళనాలను చూస్తుంటే జనమా..! గులాబీ వనమా..! అని ఆశ్చర్యపోక మానరు. అంతలా ఈ సమావేశాలకు తరలివస్తున్నారు పార్టీ శ్రేణులు, ప్రజలు. ఆయా వేదికల వద్ద చిందులు వేస్తూ, మళ్లీ బీఆర్ఎస్దే హవా అంటూ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. స్వచ్ఛందంగా తరలివస్తూ సభలకు హాజరయ్యే వారిని చూస్తున్న నేతలు రెట్టింపు ఉత్సాహంతో ప్రసంగాలు చేస్తూ, వారితో నూతన ఉత్తేజాన్ని కల్పిస్తున్నారు.
పటాన్చెరు, మార్చి 28: ‘పటాన్చెరు నియోజకవర్గంలో బీఆర్ఎస్ అజేయశక్తి, సీఎం కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అద్భుతమైన మెజార్టీని ఇచ్చి బీఆర్ఎస్ను గెలిపిస్తుంది. కార్యకర్తలు మన సంక్షేమ కార్యక్రమాలు, పథకాల్లో లబ్ధిపొందినవారిని కలిసి బీఆర్ఎస్ను దీవించమని కోరుదాం’ అని బీఆర్ఎస్ నేతలు ముక్తకంఠంతో కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. మంగళవారం పటాన్చెరు మండలంలోని పాటి గ్రామంలోని ఓ ఫంక్షన్హాల్లో బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యేను స్థానిక నాయకులు పటాకులు కాల్చి, గజమాలలు వేసి స్వాగతం పలికారు. లక్డారం బీఆర్ఎస్ నాయకుడు మాణిక్రెడ్డి ఆధ్వర్యంలో వందమంది వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు ఎమ్మెల్యే సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ బీఆర్ఎస్ కుటుంబం నిర్వహించుకుంటున్న పండుగ ‘ఆత్మీయ సమ్మేళనం’ అన్నారు. పటాన్చెరులో బీఆర్ఎస్ తిరుగులేని శక్తని, సీఎం కేసీఆర్ ఆశీస్సులతో నియోజకవర్గంలో కోట్ల అభివృద్ధి చేసుకున్నామన్నారు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం దేశంలోనే నెంబర్వన్ అని, గడపగడపకూ తాగునీరు అందజేయడంలో దేశానికే ఆదర్శంగా ఉన్నామన్నారు. రైతులకు రైతుబంధు అందజేస్తున్న సర్కార్ మనదేనన్నారు. ఒకప్పుడు కరెంటు లేక ధర్నా చేస్తే బషీర్బాగ్లో కాల్చిచంపిన ప్రభుత్వాలుండేవన్నారు. సీఎం కేసీఆర్ ఇప్పుడు 24గంటలు నాణ్యమైన కరెంటు, కాళేశ్వరం వంటి ప్రాజెక్టుల ద్వారా సాగునీరు అందజేస్తున్నారన్నారు. రాష్ట్రంలోని ప్రతి ఇంట్లో సంక్షేమ పథకాలు పొందిన లబ్ధిదారులున్నారన్నారు.
గుజరాత్లో 24గంటల కరెంట్ ఇవ్వడంలేదని ఎద్దేవా చేశారు. ప్రతిపక్షాలకు జెండా ఏజెండా లేదన్నారు. బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. రూ.300 కోట్లతో పటాన్చెరుకు సూపర్ స్పెషాలిటీ దవాఖానను మంజూరు చేయించుకున్నామన్నారు. 24గంటలు ప్రజల్లోనే ఉన్నానని ఎమ్మెల్యే అన్నారు. కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి బీఆర్ఎస్ సంక్షేమ కార్యక్రమాలు వివరించాలన్నారు. మీ అందరి ఆదరభిమానంతో పటాన్చెరును గొప్పగా అభివృద్ధి చేశానన్నారు. రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిపించిన ప్రజల రుణం తీర్చుకుంటున్నానన్నారు. పార్టీ కోసం పనిచేసే నాయకులకు, కార్యకర్తలకు అవకాశాలుంటాయన్నారు. కష్టపడ్డవారికి గుర్తింపు ఇస్తామన్నారు.
కార్యక్రమంలో ఎంపీపీ సుష్మాశ్రీవేణుగోపాల్రెడ్డి, జడ్పీటీసీ సుప్రజావెంకట్రెడ్డి, పార్టీ మండలాధ్యక్షుడు పాండు, మాజీ ఎంపీపీలు శ్రీశైలంయాదవ్, గాయత్రీపాండు, వైస్ ఎంపీపీ స్వప్నా శ్రీనివాస్, ఆత్మకమిటీ చైర్మన్ గడీల కుమార్గౌడ్, చంద్రశేఖర్రెడ్డి, సర్పంచ్లు ఉపేందర్ ముదిరాజ్, కావ్యకాశిరెడ్డి, జగన్, సుధీర్రెడ్డి, లక్ష్మణ్, భాగ్యలక్ష్మి, ఇన్చార్జి సర్పంచ్ కృష్ణయాదవ్, ఎంపీటీసీలు మన్నెరాజు, వెంకట్రెడ్డి, నాగజ్యోతి లక్ష్మణ్, నాయకులు మాణిక్రెడ్డి, దశరథరెడ్డి, వెంకట్రెడ్డి, మెరాజ్ఖాన్, గోపాల్రెడ్డి, రమేశ్బాబు, సర్దార్, మాజీ ఎంపీపీ వైస్ చైర్మన్ ప్రభాకర్గుప్తా, రామకృష్ణముదిరాజ్, సందీప్ముదిరాజ్, గూడెం యాదమ్మ, చంద్రశేఖర్రెడ్డి, చందుముదిరాజ్, కాసిరెడ్డి, అంతిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
సదాశివపేట, మార్చి 28: కార్యకర్తలే బీఆర్ఎస్కు బలం, బలగమని, వారే పార్టీకి వెన్నుదన్ను అని రాష్ట్ర చేనేత అభివృద్ధి సంస్థ చైర్మన్ చింతా ప్రభాకర్ అన్నారు. మంగళవారం సదాశివపేట బాలాజీ ఫంక్షన్హాల్లో బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు చీలమల్లన్న ఆధ్వర్యంలో ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన చింతా ప్రభాకర్ మాట్లాడుతూ కార్యకర్తలు వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయం కోసం పనిచేయాలని, ప్రతిపక్షాల కుట్రలను తిప్పికొట్టాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయన్నారు. సీఎం కేసీఆర్ హయాంలోనే తెలంగాణ అభివృద్ధి చెందిందన్నారు. గత ప్రభుత్వాలు చేసినది, తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిపై గల్లీలో చర్చ పెట్టాలన్నారు. రాబోయే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కార్యకర్తలు సైనికుల్లా పని చేయాలని పిలుపునిచ్చారు.
బట్టేబాజ్ బీజేపీ : డీసీఎంసీ చైర్మన్ మల్కాపురం శివకుమార్
బీఆర్ఎస్ పార్టీకి 60 లక్షల కుటుంబ సభ్యులున్న పెద్ద బలగం ఉన్నదని డీసీఎంసీ చైర్మన్ మల్కాపురం శివకుమార్ అన్నారు. బట్టేబాజ్ పార్టీ బీజేపీ అని, ఆ పార్టీలో మాటలు చెప్పే నాయకులే ఎక్కువని విమర్శించారు. లీడర్ లేని పార్టీ కాంగ్రెస్ అని ఎద్దేవా చేశారు. అభివృద్ధిపై పట్టణంలో చర్చ జరగాలని, అందుకు కార్యకర్తలు సైనికుల్లా పని చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నరహరిరెడ్డి, సీడీసీ కాసాల బుచ్చిరెడ్డి, బీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు చీల మల్లన్న, ప్రధాన కార్యదర్శి పిల్లిగుండ్ల వీరేశం, మున్సిపల్ వైస్ చైర్మన్ చింతా గోపాల్, కౌన్సిలర్లు పిల్లోడి విశ్వనాథం, పులిమామిడి రాజు, గుండురవి, చౌదరి ప్రకాశ్, ఇంద్రమోహన్గౌడ్, నసీరుద్దీన్, సాతాని శ్రీశైలం, కో-ఆప్షన్ సభ్యుడు అంజయ్య, నాయకులు కొత్తగొల్ల కృష్ణ, సుధీర్రెడ్డి, బిట్ల ప్రేమ్కుమార్, సోమశేఖర్, కార్యకర్తలు పాల్గొన్నారు.
కారు గుర్తుకే ఓటు వేస్తా సారు : జాం పెంటమ్మ, బచ్చుగూడెం గ్రామం
బీఆర్ఎస్ నిర్వహించిన ఆత్మీయ సదస్సుకు హాజరైన బచ్చుగూడెం గ్రామ వృద్ధురాలు జాం పెంటమ్మ. తెలంగాణ సర్కారు సంక్షేమంపై రిలీజ్ చేసిన పాటలపై జోరుగా డాన్స్ చేసింది. మహిళలు పెద్ద ఎత్తున గులాబీ కండువాలు ఊపుతూ సభలో జోష్ నింపారు. దాదాపు ఎనబై ఏండ్ల వయసుల్లో జనం మధ్య గులాబీ కండువాతో వేసిన చిందులు సభికులను ఆకట్టుకున్నాయి. తన్మయంతో లయబద్ధంగా పెంటమ్మ డాన్స్ చేయడం చూసి బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఆగి చూసి, చప్పట్లతో ప్రోత్సహించారు. ఈ సందర్భంగా జాం పెంటమ్మ తనకు సీఎం కేసీఆర్ సారు, ఎమ్మెల్యే మహిపాల్రెడ్డి సార్లంటే ఇష్టం అని తెలిపింది. పింఛన్ కూడా ఇస్తున్నారని చెప్పింది. ఈ మారు కూడా కారు గుర్తుకే ఓటు వేస్తానని చెప్పడంతో కార్యకర్తలు చప్పట్లతో జేజేలు కొట్టారు.
బూత్ స్థాయిలో లబ్ధిదారులను కలవాలి : పటాన్చెరు జడ్పీటీసీ సుప్రజావెంకట్రెడ్డి
పటాన్చెరు మండలంలో బీఆర్ఎస్ బూత్ స్థాయినుంచి పటిష్టంగా ఉంది. ప్రతి గ్రామంలోకి వెళ్లి బూత్ స్థాయిలో ప్రతి ఇంటికీ వెళ్లి సంక్షేమ పథకాల లబ్ధిదారులను కలవాలని పటాన్చెరు జడ్పీటీసీ సుప్రజావెంకట్రెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో జరిగిన అభివృద్ధి, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు గొప్పగా ఉన్నాయన్నారు. మండలంలోని లబ్ధిదారులను కార్యకర్తలు కలిసి సీఎం కేసీఆర్ చేసిన సాయాన్ని విడమర్చి చెప్పాలని సూచించారు. నియోజకవర్గంలో మళ్లీ బీఆర్ఎస్ జెండాను భారీ మెజార్టీతో ఎగురవేద్దామన్నారు.
మహిళలకు పట్టం కట్టిన బీఆర్ఎస్ : పటాన్చెరు ఎంపీపీ సుష్మాశ్రీవేణుగోపాల్రెడ్డి
బీఆర్ఎస్ ప్రభుత్వం మహిళలకు పట్టంకట్టిందని, స్థానిక సంస్థల్లో 50 శాతం రిజర్వేషన్లు ఇచ్చిందని పటాన్చెరు ఎంపీపీ సుష్మాశ్రీవేణుగోపాల్రెడ్డి అన్నారు. ఇప్పుడు పార్లమెంట్లోనూ మహిళలకు రిజర్వేషన్లు డిమాండ్ చేస్తున్న ప్రభుత్వం మనదని చెప్పారు. బీఆర్ఎస్ ప్రభుత్వం సాయం చేయడంతోనే ఈ మీటింగ్కు సగానికి మించి మహిళలు వచ్చారని, మీ ఆదరణ ఇలానే ఉంటే రికార్డు స్థాయి లో బీఆర్ఎస్కు మెజార్టీని ఇస్తామన్నారు. ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేస్తున్నారు. మండలంలో 13 ఉత్తమ గ్రామాలుగా ఎంపికయ్యాయని గుర్తు చేశారు.
సీఎం కేసీఆర్కు రుణపడి ఉంటాం..
నా పేరు లక్ష్మి, మేము మనువరాలికి లగ్గం చేసినం. కల్యాణలక్ష్మి పథకం కింద రూ.లక్ష 116 వచ్చినయ్. సీఎం కేసీఆర్కు రుణపడి ఉంటాం.
– లక్ష్మి, సదాశివపేట, కల్యాణలక్ష్మి లబ్ధిదారు