మెదక్, అక్టోబర్ 28 : ప్రైవేట్ రంగంలో ఉద్యోగావకాశాలు కల్పించుటకు ఈ నెల 30న జాబ్ మేళా నిర్వహిస్తున్నామని జిల్లా ఉపాధి అధికారి విజయ్కుమార్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. హైదరాబాద్కు చెందిన ఫైనాన్షియల్ ఇంక్లూజన్లో డెలివరీ పార్ట్ నర్స్ 200 ఉద్యోగాల ఖాళీలకు ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారని ఆయన తెలిపారు.
కాగా ఈ ఉద్యోగాలకు 18 నుంచి 35 సంవత్సరాలలోపు వయస్సు కలిగి 10వ తరగతి పాస్ లేదా ఫెయిల్ అయిన అభ్యర్ధులు అర్హులని పేర్కొన్నారు. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.18వేల నుంచి రూ.25వేల వరకు జీతం ఉంటుందని అన్నారు.
అర్హత కలిగి ఆసక్తి గల జిల్లాకు చెందిన అభ్యర్ధులు ఈ నెల 30న ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు మెదక్ పట్టణంలోని హౌసింగ్బోర్డు ఎస్సీఐ గోదాం పక్కన గల ప్రైవేట్ ఐటీఐలో జరుగు ఇంటర్వ్యూకు హాజరుకావాలని, వివరాలకు 8247656356 నంబర్కు సంప్రదించాలని సూచించారు.