మెదక్ మున్సిపాలిటీ, జూన్ 13 : ప్రైవేట్ రంగంలో ఉద్యోగావకాశాలు కల్పించేందుకు ఈ నెల 16న జిల్లా కేంద్రంలోని ప్రైవేట్ ఐటీఐలో జాబ్మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారి విజయ్కుమార్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.
హైదరాబాద్కు చెందిన అపోలో ఫార్మసీ వారు ఫార్మాసిస్ట్, ట్రైనీ ఫార్మసిస్ట్, ఫార్మా అసిస్టెంట్, రిటైల్ ట్రైనీ అసిస్టెంట్ ఉద్యోగాలు జాబ్మేళా నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. 75 ఫార్మాసిస్ట్ ఉద్యోగాలకు పురుష, మహిళా అభ్యర్థులు అర్హులని.. డీ ఫార్మాసీ, లేదా బీ ఫార్మాసీ చేసి ఉండాలన్నారు.
అభ్యర్థులకు నెలకు రూ.12 వేల నుంచి రూ.20 వేల వరకు వేతనం చెల్లిస్తారన్నారు. ట్రైనీ ఫార్మసిస్ట్ ఉద్యోగాలకు అభ్యర్థులు డీ ఫార్మసీ లేదా బీ ఫార్మసీ చేయి ఉండాలన్నారు. వీరికి రూ.11,600 నుంచి రూ.18 వేల వేతనం కలిగి ఉంటుందన్నారు. అలాగే ఫార్మా అసిస్టెంట్ ఉద్యోగాలకు రూ.10,600 వేతన ఉంటుందన్నారు.
జాబ్ మేళాలో ఎంపికైన అభ్యర్థులు హైదరాబాద్లో పనిచేయాల్సి ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. ఆసక్తి గల జిల్లాకు చెందిన అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకవాలన్నారు. మంగళవారం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు జరిగే జాబ్ మేళాకు హాజరు కావాలని సూచించారు. పూర్తి వివరాలకు 8247656356 నంబర్ను సంప్రదించాలని విజయ్కుమార్ తెలిపారు.