ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి
టీఎఫ్ యూటీఎఫ్ ఆధ్వర్యంలో మోడల్ టెట్ పేపర్ విడుదల
గజ్వేల్ రూరల్, జూన్ 5 : ఉద్యోగ సాధనకు ప్రణాళికాబద్ధంగా శ్రమించాలని ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి అన్నారు. ఆదివారం టీఎస్ యూటీఎఫ్ ఆధ్వర్యంలో మోడల్ టెట్ పేపర్ విడుదల చేసిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం భారీ సంఖ్యలో ఉద్యోగాల భర్తీ చేసేందుకు త్వరలోనే విడతల వారీగా నోటిఫికేషన్ జారీ చేసేందుకు సిద్ధమవుతున్నదని, అందుకు ప్రతి అభ్యర్థి ఉద్యోగ సాధన లక్ష్యంగా చదువుకోవాలన్నారు. ఇప్పటికే పోలీస్ నియామకాల కోసం నోటిఫికేషన్ వచ్చిందని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్, మున్సిపల్ వైస్ చైర్మన్ జకీయొద్దీన్, టీఎస్ యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు వలి అహ్మద్, సీఐటీయూ జిల్లా నాయకులు ఎల్లయ్య, నాయకులు గుంటుక రాజు, కిషన్రెడ్డి, రమేశ్గౌడ్ పాల్గొన్నారు.
పీఆర్టీయూ ఆధ్వర్యంలో టెట్ గ్రాండ్ టెస్ట్
పీఆర్టీయూ ఆధ్వర్యంలో నిర్వహించిన మోడల్ ఆన్లైన్ టెట్ పరీక్షకు మంచి స్పందన రావడం అభినందనీయమని ఎమ్మెల్సీ కూర రఘోత్తంరెడ్డి అన్నారు. ఆదివారం పీఆర్టీయూ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆన్లైన్ టెట్ పేపర్-1 ఉచిత గ్రాండ్ టెస్ట్ లింక్ను హైదరాబాద్లోని పీఆర్టీయూ కార్యాలయంలో ఎమ్మెల్సీలు కూర రఘోత్తంరెడ్డి, కాటేపల్లి జనార్దన్రెడ్డి, రాష్ట్ర అధ్యక్షుడు పింగళి జైపాల్రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ రఘోత్తంరెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్ర చరిత్రలోనే మొదటిసారిగా పీఆర్టీయూ సిద్దిపేట జిల్లా శాఖ తరఫున నిర్వహించిన ఆన్లైన్ మోడల్ టెట్కు మంచి స్పందన రావడం ఇదొక చక్కని మైలురాయని కొనియాడారు. సిద్దిపేట జిల్లాలో ఆన్లైన్ టెట్ గ్రాండ్ టెస్ట్కు 2 వేల మంది అభ్యర్థులు పాల్గొన్నట్లు పీఆర్టీయూ ప్రతినిధులు తెలిపారు. కార్యక్రమంలో పీఆర్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బీరెల్లి కమలాకర్రావు, మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్, సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు ఆదరాసుపల్లి శశిధరశర్మ, ప్రధాన కార్యదర్శి పంతం వెంకటరాజం పాల్గొన్నారు.
యూటీఎఫ్ ఆధ్వర్యంలో మోడల్ టెట్
టీఎస్ యూటీఎఫ్ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా జరిగిన మోడల్ టెట్ పరీక్షకు మంచి స్పందన లభించిందని యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి యాదగిరి తెలిపారు. ఆదివారం జిల్లా వ్యాప్తంగా 4 పరీక్షా కేంద్రాల్లో జరిగిన పరీక్షకు పేపర్-1కు 490 మంది అభ్యర్థులు, పేపర్-2కు 272 మంది అభ్యర్థులు హాజరైనట్లు తెలిపారు. అంతకుముందు సిద్దిపేట పట్టణంలోని ప్రతిభ డిగ్రీ కళాశాల కేంద్రంలో జడ్పీ చైర్పర్సన్ పరీక్షా పత్రాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ టీఎస్ యూటీఎఫ్ ఆధ్వర్యంలో మోడల్ టెట్ పరీక్ష నిర్వహించడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో టీఎస్ యూటీఎఫ్ జిల్లా పూర్వ అధ్యక్షుడు నగేశ్, జిల్లా కోశాధికారి కృష్ణ, జిల్లా కార్యదర్శులు శివలింగం, కనకరాజు, గిరిబాబు పాల్గొన్నారు.