జిల్లావ్యాప్తంగా శుక్రవారం జగ్జీవన్రామ్ జయంతిని జరుపుకొన్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలు బాబూజగ్జీవన్రామ్ విగ్రహాలు, చిత్రపటాలకు పూలమాల వేసి నివాళులర్పించారు. ప్రభుత్వ దవాఖానల్లో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ భారత మాజీ ఉప ప్రధాని బాబూ జగ్జీవన్రామ్ సేవలు చిరస్మరణీయమన్నారు. నేటి యువత జగ్జీవన్రామ్ను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. అణగారిన వర్గాల సంక్షేమం కోసం ఆయన అలుపెరగని పోరాటం చేశారని గుర్తుచేశారు.