దుబ్బాక, జనవరి 24: మాఘ అమావ్యాస సందర్భంగా కూడవెల్లి రామలింగేశ్వరాలయం వద్ద జాతర కొనసాగుతోంది. నాలుగో రోజు మంగళవారం ఆలయానికి భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ఇక్కడి త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించి స్వామివారిని దర్శించుకున్నారు.
హుండీ ఆదాయం రూ.3.50 లక్షలు
కూడవెల్లి రామలింగేశ్వరాలయంలో మంగళవారం హుండీ ఆదాయాన్ని లెక్కించారు. హుండీల్లో రూ.3,50,281 నగదు ఆదాయం సమకూరిందని ఆలయన నిర్వాహకులు తెలిపారు. కొబ్బరి కాయల విక్రయం ద్వారా రూ.2.40 లక్షలు, పులిహోర, లడ్డు ప్రసాదం ద్వారా రూ.3.50 లక్షల ఆదాయం వచ్చిందని చెప్పారు. ఆలయ కమిటీ చైర్మన్ పూజారి చంద్రం, ఈవో విశ్వనాథశర్మ, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.