జహీరాబాద్,అక్టోబర్ 16: జహీరాబాద్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీలో భారీగా కాంగ్రెస్, బీజేపీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు చేరారు. సోమవారం జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్రావు, నియోజకవర్గ ఎన్నికల ఇన్చార్జి దేవిప్రసాద్రావు, రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ నరోత్తం, రాష్ర్ట పారిశ్రామిక అభివృద్ధి సంస్థ చైర్మన్ తన్వీర్, ఉమ్మడి జిల్లా డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్ ఆధ్వర్యంలో భారీగా కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు చెందిన నాయకులు చేరారు. జహీరాబాద్ మండలంలోని అర్జున్నాయక్ తండాకు చెందిన కాంగ్రెస్కు చెందిన పలువురు ఎమ్మెల్యే మాణిక్రావు సమీక్షంలో గులాబీ పార్టీలో చేరారు.
మొగుడంపల్లి మండలంలోని గౌసాబాద్ ఎంపీటీసీ కిషన్ రాథోడ్ ఆదివారం కాంగ్రెస్ పార్టీలో చేరగా, రాత్రి రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ నరోత్తం సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. బీఆర్ఎస్ ఎంపీటీసీగా గెలుపొందిన కిషన్ రాథోడ్కు కాంగ్రెస్ నాయకుల మాయమాటలు విని ఆ పార్టీలోకి చేరినట్లు ప్రకటించారు. వెంటనే బీఆర్ఎస్ నాయకుడు కిషన్ రాథోడ్తో మాట్లాడి బీఆర్ఎస్లో చేర్పించారు. జహీరాబాద్లో గులాబీ పార్టీ గెలుపు కోసం ఎన్నికల ఇన్చార్జి దేవిప్రసాద్ ఆధ్వర్యంలో వ్యూహాలు చేస్తున్నారు. ప్రతి గ్రామంలోని బూత్ కమిటీలను పర్యవేక్షించేందుకు కొత్తగా కమిటీలు ఏర్పాటు చేస్తున్నారు. బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే మాణిక్రావును భారీ మోజార్టీతో గెలుపించేందుకు వారు ప్రయత్నాలు చేస్తున్నారు.