సంగారెడ్డి, ఏప్రిల్10 : రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్రావు జిల్లా కేంద్రం సంగారెడ్డి పట్టణంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు, జడ్పీ సమావేశానికి హాజరు కానున్నారు. మంగళవారం పట్టణంలో జరుగనున్న కార్యక్రమాలలో ఉదయం 10.45గంటలకు మహాత్మా జ్యోతిబాపూలే 197వ జయంతి వేడుకల్లో పాల్గొని విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పిస్తారు. ఉదయం11గంటలకు జడ్పీ సమావేశంలో పాల్గొననున్నారు. మధ్యాహ్నం 1.30 గంటలకు కొండాపూర్ మండంలోని మల్కాపూర్ శివారులో సంయుక్త ఇంటర్నేషనల్ పాఠశాలను ప్రారంభిస్తారు.
అనంతరం మధ్యాహ్నం 3గంటలకు పట్టణంలోని నాల్సాబ్గడ్లోబస్తీ దవాఖానను ప్రారంభించనున్నారు. 3.45 గంటలకు గొల్లగూడెంలో భవన నిర్మాణ కార్మికుల సంఘ భవనానికి భూమిపూజ చేయనున్నారు. 4.30గంటలకు పోలీస్ కన్వెన్షన్ కేంద్రానికి శంకుస్థాపన చేయనున్నారు. 5.30గంటలకు కలెక్టరేట్ వెనకాల నిర్మించిన ఈఎల్ఎస్ఆర్ వాటర్ ట్యాంక్ను ప్రారంభిస్తారు. అనంతరం సాయంత్రం 6 గంటలకు ఇఫ్తార్ విందులో పాల్గొననున్నారు.