మెదక్, సెప్టెంబర్ 20 (నమస్తే తెలంగాణ) : వానకాలం సీజన్లో జిల్లాలో 5లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం వచ్చే అవకాశమున్నందున సంబంధిత అధికారులు సన్నద్ధంగా ఉండాలని అదనపు కలెక్టర్ రమేశ్ అధికారులకు సూచించారు. మం గళవారం తన ఛాంబర్లో వానకాలం 2022-23కు సంబంధించి నోడల్ అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ అక్టోబర్ 15 తరువాత భారీగా మార్కెట్కు ధా న్యం వచ్చే అవకాకాశమున్నదని, రైతులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు ప్రణాళికతో సిద్ధంగా ఉండాలని సూచించారు. ఏ-గ్రేడు రకం ధాన్యానికి 2,060, సాధారణ రకం ధాన్యానికి రూ. 2040 మద్ధతు ధర ప్రభుత్వం ప్రకటించిందన్నారు. వానకాలం మాదిరే ఈ సీజన్లో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు, ఐకేపీ ఆధ్వర్యంలో 350 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుకు అన్ని చర్యలు తీసుకోవాలని జిల్లా సహకార అధికారి, డీఆర్డీవోకు సూచించారు. అదే విధంగా కొనుగోలు కేంద్రాల్లో అవసరమైన టార్పాలిన్లు, ప్యాడి క్లీనర్, తేమ ను కొలిచే యంత్రాలు, డిజిటల్ కాంటలు అందుబాటులో ఉం చాలని, ప్రస్తుతమున్న వాటిలో చిన్నచిన్న మరమ్మతులు ఉంటే వెంటనే చేపట్టాలని, ఇంకా అవసరమైన వాటికి ఇండెంట్ పెట్టాలని మార్కెటింగ్ అధికారికి సూ చించారు.
ధాన్యం సేకరణలో ప్రధాన సమస్య గోనె సంచులు, రవాణా అని, సుమారు కోటి 60లక్షల గోనె సంచులు అవసరమవుతాయని, కాగా 40లక్షలు అందుబాటులో ఉన్నాయ ని, మిగతా వాటిని తెప్పించుటకు చర్యలు తీసుకోవాలని జి ల్లా పౌర సరఫరాల జిల్లా మేనేజర్కు సూచించారు. ధాన్యాన్ని రైస్ మిల్లులకు తరలించడంతో పాటు పొరుగు జిల్లాలకు తరలించుటకు వీలుగా 2వేల లారీలు సమకూర్చాలని జిల్లా రవాణాధికారికి సూచించారు. గతంలో రైస్మిల్లుల కాంటాల వద్ద తూకంలో అవకతవకలు జరిగాయని, ఈ దపా అలా జరగకుండా చూడాలని లీగల్ అండ్ మెట్రాలజీ అధికారికి సూచించారు. ధాన్యం ఎక్కువగా వచ్చే పెద్ద కొనుగోలు కేంద్రాల్లో పోలీసులను ఏర్పాటు చేయాలని పోలీసు అధికారులకు సూచించారు. పంట కోతలు ఒకేసారి కాకుండా రైతులకు టోకెన్లు ఇచ్చి ఆ ప్రకారం కోతలు కోసి 17శాతం తేమ మించకుండా, తాలు లేకుండా కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తెచ్చేలా రైతుల్లో అవగాహన కలిగించాలని వ్యవసాయాధికారులకు సూచించారు. సహాయ వ్యవసాయాధికారులు, వ్యవసాయ విస్తరణాధికారులతో సమన్వయం చేసుకుంటూ కేంద్రాలకు ఎంత ధాన్యం వచ్చేది ఖచ్చితమైన వివరాలు అందించాలని, ముందస్తుగా వారికి శిక్షణా కార్యక్రమాలు నిర్వహించాలని వ్యవసాయాధికారిని ఆదేశించారు.
అదే విధంగా కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం ఎప్పటికప్పుడు లారీ ల్లో తరలించుటకు హమాలీల ఏర్పాటు, రైతులకు డబ్బు లు సకాలంలో చెల్లించుటకు ట్రక్ షీట్, టాబ్ ఎంట్రీ త్వరితగతిన చేయాలని, మిల్లులలో ధాన్యం ఆన్లోడింగ్ సమస్య రాకుండా తగు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ దఫా ధాన్యం సేకరణలో రెవెన్యూ సిబ్బంది ఉండరని, ఎంపీడీవోలు, ఎంపీవోలు, పంచాయతీ కార్యదర్శిలు పూర్తి భాగస్వామ్యం ఉండేలా చూడాలని జిల్లా పరిషత్ సీఈఓకు సూచించారు. పెద్ద ఎత్తున మార్కెట్కు ధాన్యం వచ్చే అవకాశమున్నందున ఒక యజ్ఞంలా భావించి అందరూ సమన్వయంతో పని చేయాలని, బయటి నుంచి కేంద్రాలకు ధాన్యం రాకుండా నిఘా పెట్టాలని, కొనుగోళ్లా ప్రక్రియ ముగిసే వరకు అధికారులకు సెలవులు ఉండవని ఆయన స్పష్టం చేశారు. సమావేశంలో జడ్పీ సీఈవో శైలేశ్, డీఆర్డీవో శ్రీనివాస్, జిల్లా పౌర సరఫరాల జిల్లా మేనేజర్ గోపాల్, డీఎస్వో శ్రీనివాస్, వ్యవసాయాధికారి ఆశాకుమారి, డీసీవో కరుణ, జిల్లా రవాణాధికారి శ్రీనివాస్గౌడ్, లీగల్ మెట్రాలజీ అధికారి సుధాకర్ పాల్గొన్నారు.