శివ్వంపేట, డిసెంబర్ 11 : శివ్వంపేట మండలం సికింద్లాపూర్లోని ప్రసిద్ధ్ద పుణ్యక్షేత్రం లక్ష్మీనర్సింహాస్వామి ఆలయం ఆదివారం భక్తులతో కిక్కిరిసింది. భారీగా భక్తులు తరలివచ్చి, స్వామివారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. ఆల య ఈవో శశిధర్ లాంటి ఇబ్బందులు కలుగకుండా చర్యలు చేపట్టారు. ప్రధాన పూజారి ధనుంజయశర్మ భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. కార్యక్రమంలో అర్చకులు విద్యాకర్చారి, జూనియర్ అసిస్టెంట్ నర్సింహరెడ్డి ఉన్నారు.
కొయ్యగుట్టమల్లన్నకు భక్తుల బోనాలు
మెదక్ రూరల్, డిసెంబర్ 11 : మెదక్ మండలంలోని మంబోజిపల్లి శివారులో కొయ్యగుట్టపై కొలువుదీరిన మల్లి ఖార్జునస్వామిని భక్తులు దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వ హించారు. ఆలయ పూజారి మల్లన్న స్వామివారికి పూజలు, అభిషేకాలు చేశారు. భక్తులు పట్నాలు వేసి మొక్కులు తీర్చు కున్నారు. మహిళలు స్వామివారికి బోనాలు సమర్పించారు.
వైభవంగా అయ్యప్ప స్వామి పడిపూజ
మెదక్ మండలం మంబోజిపల్లిలో అయ్యప్ప ఆలయం లో మహాపడిపూజ వైభవంగా జరిగింది. ప్రధాన అర్చకుడు వైద్య రాజు ఆధ్వర్యంలో అయ్యప్ప మహాపడి పూజ నిర్వహిం చారు. కార్యక్రమంలో మెదక్ మార్కెట్ కమిటీ చైర్మన్ జగపతి, నాయకులు శ్రీనివాస్రెడ్డి, వెంకట్గౌడ్ పాల్గొన్నారు.
చాముండేశ్వరీ ఆలయంలో భక్తుల రద్దీ
చిలిపిచెడ్, డిసెంబర్ 11 : మండలంలోని చిట్కుల్ గ్రామ శివారులో వెలిసిన చాముండేశ్వరీ ఆలయం భక్తులతో రద్దీగా మారింది. పలు ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చి ఆలయ సమీపంలోని మంజీరా నదిలో పుణ్యస్నానాలు చేసి, అమ్మవారికి కుంకుమార్చనలు, ఒడిబియ్యం సమర్పించారు. ఆలయ పూజరి ప్రభాకరశర్మ అమ్మవారికి ప్రత్యేక అలంకరణ చేసి, భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు అన్నదానం ఏర్పాటు చేశారు.
ఏడుపాయలలో భక్తుల సందడి
పాపన్నపేట, డిసెంబర్ 11: పవిత్ర పుణ్యక్షేత్రమైన ఏడుపాయల వనదుర్గాభవానీమాత ఆలయం ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు అమ్మవారిని దర్శించుకుని, ఒడిబియ్యం, కుంకుమార్చనలు, తలనీలాలు, బోనాలు సమర్పించి మొక్కుకున్నారు. ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఏడుపాయల చైర్మన్ బాలాగౌడ్, ఈవో శ్రీనివాస్ తగిన ఏర్పాట్లు చేశారు. స్థానికంగా ఎలాంటి సంఘటనలు చోటు చేసుకోకుండా పాపన్నపేట ఎస్సై విజయ్కుమార్ తగిన బందోబస్తు చర్యలు చేపట్టారు.
సిద్ధివినాయకుడికి ప్రత్యేక పూజలు
న్యాల్కల్, డిసెంబర్ 11: మండలంలోని రేజింతల్ సిద్ధివినాయక ఆలయంలో ఆదివారం భక్తుల దర్శనాలతో సందడిగా మారింది. సంకష్టహర చతుర్ధిని పురష్కరించుకుని ఉదయం నుంచే ఆలయంలో పూజారులు స్వామివారికి అభిషేకాలు, కుంకుమార్చన, హారతి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా పలు ప్రాంతాలకు చెందిన భక్తులు స్వామి వారికి ప్రత్యేక పూజలు చేసి దర్శించుకున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఆలయ ట్రస్టు ఆధ్యర్యంలో ఏర్పాట్లు చేశారు. తొగుట ఆశ్రమ పీఠాథిపతి మాధవనంద సరస్వతీ మహారాజ్ స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. మండల పరిధిలోని హద్నూర్లోని వరసిద్ధివినాయక, చీకూర్తిలోని సిద్ధి వినాయక ఆలయాల్లో సంకష్టహర చతుర్ధి వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో ఆయా ఆలయాల నిర్వాహకులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.