హుస్నాబాద్, డిసెంబర్ 3: మాజీ ఎంపీ కెప్టెన్ లక్ష్మీకాంతారావు, హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితెల సతీశ్కుమార్ను హనుమకొండలోని వారి నివాసంలో హోంశాఖ మంత్రి మహమూద్ అలీ శనివారం సాయంత్రం పరామర్శించారు. కెప్టెన్ ఇటీవల కొంత అనారోగ్యానికి గురై తిరిగి కోలుకున్నారు.
ఎమ్మెల్యే సతీశ్ కుమార్కు మోకాలి శస్త్ర చికిత్స జరుగగా, వీరిని స్వయంగా ఇంటికి వచ్చి హోంమంత్రి పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. తమ ఇంటికి వచ్చిన హోంమంత్రికి కెప్టెన్ దంపతులు, ఎమ్మెల్యే పుష్పగుచ్ఛం ఇచ్చి స్వాగతం పలికారు. హోంమంత్రి వెంట ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ ఉన్నారు.