సీఎం కేసీఆర్ పాలనలో అన్ని వర్గాలకు సంక్షేమ ఫలాలు అందుతున్నాయని, వ్యవసాయం, సాగునీరు, విద్య, వైద్య రంగాల అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యమిస్తున్నారని హోం శాఖ మంత్రి మహమూద్ అలీ అన్నారు. సంగారెడ్డి పోలీసు పరేడ్గ్రౌండ్స్లో మంగళవారం నిర్వహించిన స్వాతంత్య్ర దినోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. కలెక్టర్ శరత్కుమార్, ఎస్పీ రమణకుమార్,హెచ్డీసీ చైర్మన్ చింతాప్రభాకర్తో కలిసి జాతీయ జెండా ఎగురవేసి, జిల్లా ప్రగతిని ప్రజలకు వివరించారు.ఈ సందర్భంగా స్వాతంత్య్ర సమరయోధుల కుటుంబ సభ్యులను సన్మానించారు. ఉత్తమ సేవలందించిన వివిధ శాఖలకు చెందిన 26 మంది ప్రభుత్వ అధికారులు, 139 మంది ఉద్యోగులు, సిబ్బందికి ప్రశంసాపత్రాలు అందజేశారు.
సంగారెడ్డి, ఆగస్టు 15 (నమస్తే తెలంగాణ): సీఎం కేసీఆర్ పాలనలో అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాల ఫలాలు అందుతున్నాయని, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్లో తెలంగాణ రాష్ట్రం దేశానికి దిక్సూచిగా మారిందని హోంశాఖ మం త్రి మహమూద్ అలీ అన్నారు. సంగారెడ్డి పరేడ్ గ్రౌండ్లో మంగళవారం స్వాతంత్య్ర వేడుకలు జరిగాయి. వేడుకలకు హోంమంత్రి ముఖ్యఅతిథిగా హాజరై జాతీయ జెండాను ఆవి ష్కరించారు. ఈ సందర్భంగా హోంమంత్రి మాట్లాడు తూ.. దేశంలో ఎక్కడా లేనివిధంగా రాష్ట్రంలో అభివృద్ధ్ది పనులు జరుగుతున్నాన్నారు. సీఎం కేసీఆర్ పాలనలో సంగారెడ్డి జిల్లా అన్ని రంగాల్లో అభివృద్ది చెందుతున్నట్లు వివరించారు. సంగారెడ్డి జిల్లాలో వ్యవసాయం, సాగునీరు, విద్య, వైద్య రంగాల అభివృద్ధ్దికి అధిక ప్రాధాన్యం ఇచ్చినట్లు తెలిపారు.
వ్యవసాయం, సాగునీటి రంగాలకు ప్రాధాన్యం
సంగారెడ్డి జిల్లాలో రైతుబంధు ద్వారా 11 విడతల్లో 3.25 లక్షల మంది రైతులకు రూ.3557.45 కోట్లు జమ చేసినట్లు తెలిపారు. 6698 మంది రైతు కుటుంబాలకు రైతుబీమాగా రూ.335 కోట్లు అందజేశామన్నారు. పంట నష్టపోయిన రైతులకు రూ.4.04 కోట్ల పరిహారం అందజేసినట్లు తెలిపారు. రూ.4427 కోట్లతో సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల పథకాలు నిర్మించి 3.84 లక్షల ఎకరాలకు సాగునీరు ఇవ్వనున్నట్లు తెలిపారు. మిషన్ కాకతీయ ద్వారా చెరువుల కింద 1.20 లక్షల ఆయకట్టు స్థిరీకరించినట్లు చెప్పారు. జిల్లాలో రూ.42కోట్లతో 70వేల మెట్రిక్ టన్నుల సామర్థ్యం ఉన్న 22 గోదాములు నిర్మించినట్లు తెలిపారు. యాసంగిలో 1.55 లక్ష ల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించి రూ.320 కోట్లు చెల్లించినట్లు చెప్పారు. రెండో విడతలో 402 యూనిట్ల్ల గొర్రెలను పంపిణీ చేశామన్నారు. జిల్లాలోని 22 మండలాల్లో 161 పాలసేకరణ కేంద్రాల ద్వారా ప్రతిరోజూ 11,500 లీటర్ల పాలు సేకరిస్తున్నట్లు హోంమంత్రి వివరించారు.
ప్రజలందరికీ సంక్షేమ ఫలాలు
దళితబంధులో ప్రతి నియోజకవర్గంలో 1100 మందికి రూ.10 లక్షల చొప్పున ఆర్థికసాయం అందజేశామన్నారు. 1808 ఎకరాల పోడు భూములను సాగు చేస్తున్న 1127 మందికి పట్టాలు ఇచ్చినట్లు తెలిపారు. బీసీబంధు పథకం ద్వారా 1500 మంది లబ్ధిదారులకు రూ.15 కోట్లు అందజేశామన్నారు. 448 మంది మైనార్టీలకు రూ.లక్ష చొప్పున ఆర్థి కసాయం అందజేసినట్లు తెలిపారు. ఆరోగ్యలక్ష్మి పథకంతో 12వేల మంది గర్భిణులు, 11వేల మంది బాలింతలు, 6వేల మంది పిల్లలు లబ్ధిపొందుతున్నట్లు వివరించారు. కల్యాణలక్ష్మి ద్వారా ఇప్పటివరకు 40716 మందికి రూ.388 కోట్లు, షాదీముబారక్ ద్వారా 11243 మందికి రూ.105కోట్లు అందజేశామన్నారు.
3450 మందికి డబుల్ బెడ్రూం ఇండ్లు అందజేసినట్లు చెప్పారు. గృహాలక్ష్మి ద్వారా జిల్లాలో 14250 ఇండ్ల నిర్మాణాలకు ఆర్థికసాయం మంజూరు చేయనున్నట్లు తెలిపారు. పటాన్చెరులో రూ.70కోట్లతో నిర్మించే సూపర్స్పెషాలిటీ దవాఖానకు సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేశారన్నారు. సంగారెడ్డిలో మెడికల్, నర్సింగ్ కాలేజీలు ప్రారంభించినట్లు తెలిపారు. రూ.24కోట్లతో సంగారెడ్డిలో క్రిటికల్ కేర్ దవాఖాన నిర్మిస్తున్నట్లు చెప్పారు. 173 పల్లె దవాఖానలు, 19 బస్తీ దవాఖానలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రెండో విడత కంటివెలుగులో 11.28 లక్షల మందికి పరీక్షలు చేసి 1.48 లక్షల మందికి కంటి అద్దాలు అందజేసినట్లు చెప్పారు. 3912 మంది గర్భిణులకు న్యూట్రిషన్ కిట్లు అందజేశామని, జిల్లాకు 25 అంబులెన్లు ఇచ్చినట్లు వివరించారు. జిల్లాలో 1,61,593 మందికి ఆసారా పింఛన్ ద్వారా ప్రతినెల రూ. 36.30 కోట్ల ఇస్తున్నట్లు తెలిపారు. దివ్యాంగులకు ఇచ్చే పింఛన్ మొత్తాన్ని రూ.4016లకు పెంచినట్లు చెప్పారు.
సంగారెడ్డి జిల్లాలో భారీగా అభివృద్ధి పనులు
సంగారెడ్డి జిల్లాలో భారీగా అభివృద్ధి పనులు చేపట్టినట్లు హోంమంత్రి మహమూద్ అలీ తెలిపారు. మిషన్భగీరథలో రూ.1138 కోట్లు ఖర్చు చేసి ఇంటింటికి తాగునీరు ఇస్తున్న ట్లు చెప్పారు. ప్రతినెలా పంచాయతీల్లో చేపట్టనున్న పనులకు ప్రభుత్వం రూ.10.42 కోట్లు విడుదల చేస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో రోడ్ల నిర్మాణాలకు రూ.192 కోట్లు, పంచాయతీరాజ్ రహదారుల అభివృద్దికి రూ.134 కోట్లు విడుదల చేసినట్లు తెలిపారు. జిల్లాలోని 441 పాఠశాలలను రూ.181 కోట్లతో ‘మనఊరు-మనబడి’ ద్వారా అభివృద్ది చేసినట్లు చెప్పారు.
స్వాతంత్య్ర వేడుకల్లో కలెక్టర్ శరత్, ఎస్పీ రమణకుమార్, అదనపు కలెక్టర్లు చంద్రశేఖర్, మాధురి, హ్యాండ్లూమ్ కార్పొరేషన్చైర్మన్ చింతా ప్రభాకర్, డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్, మున్సిపల్చైర్మన్ విజయలక్ష్మి, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.