Holi Festival | నర్సాపూర్: చంద్రగ్రహణం దృష్ట్యా మంగళవారం మధ్యాహ్నం ఒంటిగంట లోపే హోలీ పండుగను జరుపుకోవాలని ప్రముఖ పురోహితులు గౌడిచర్ల హరిప్రసాద్ శర్మ వెల్లడించారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు చంద్రగ్రహణం ఏర్పడుతుందని.. ఈలోపే పండుగ జరుపుకోవాలని సూచించారు.
ఇక భోజనాలు కూడా ఒంటి గంటలోపే పూర్తిచేసుకుని హోలీ పండుగకు ముగింపు పలకాలని గౌడిచర్ల హరిప్రసాద్ శర్మ తెలిపారు. గ్రహణం అనంతరం సాయంత్రం 7 గంటల తర్వాత స్నానాలు చేసి భోజనం చేయాలన్నారు. గ్రహణ సమయంలో గర్భిణులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. పుబ్బ నక్షత్రం సింహరాశి వాళ్లకు దోషం ఉందని.. గ్రహణం సమయంలో బయటకు వెళ్లకూడదని హెచ్చరించారు.