మర్కూక్, జనవరి 9: వేదసాగు పద్ధతిలో వరిసాగు చేస్తే అధిక లాభాలు పొందవచ్చని, రైతులకు ఖర్చు కూడా తక్కువ అవుతుందని డీఏవో శివప్రసాద్ అన్నారు. మంగళవారం మండల పరిధిలోని దామరకుంటలో డ్రమ్ సీడర్ ద్వారా వరిసాగు చేస్తున్న రైతు గణేశ్ పొలాన్ని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మండలంలో 120 ఎకరాల్లో వెదసాగు పద్ధతిలో రైతులు వరిసాగు చేస్తున్నారన్నారు. నారుమడి పద్ధతిలో ఎకరాకు 25 నుంచి 30 కిలోల విత్తనాలు అవసరం ఉంటాయన్నారు. కార్యక్రమంలో అధికారులు నగేందర్రెడ్డి, విష్ణువర్ధన్రెడ్డి, అశ్విని తదితరులు పాల్గొన్నారు.