సిద్దిపేట, జూలై 6 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : దళిత బంధు పథకం సామాజిక విప్లవమని.. వెనుకబాటుతనం ఆధునిక సమాజంలో లేదని రాష్ట్ర ఆర్థ్ధిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. సీఎం కేసీఆర్ ఎస్సీ సామాజిక వర్గాల అభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నారని తెలిపారు. నియోకవర్గస్థాయిలో లబ్ధ్దిదారుల ఎంపికలో జాగ్రత్త లు తీసుకుని నిజమైన అర్హులకు మొదటగా సంక్షేమ పథకా లు అందేలా చూడాలన్నారు. ఎమ్మెల్యేలు, కలెక్టర్లు వెంటనే వారికి నిధులు విడుదల చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. బీసీలకు లక్ష రూపాయల ఆర్థికసాయం (బీసీ బం ధు), గృహలక్ష్మి, ఇండ్ల స్థలాల పంపిణీ, గొర్రెల పంపిణీ, దివ్యాంగుల పెన్షన్, కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ తదితర పథకాల అమలుపై మంత్రి హరీశ్రావు పలు సూచనలు చేశారు. గురువారం సంగారెడ్డి జిల్లా పటాన్చెరులో ఉమ్మడి మెదక్ జిల్లా ఎంపీలు, ఎమ్మెల్యేలు, కలెక్టర్లు, అడిషనల్ కలెక్టర్లు, ఎస్పీలు, ఆర్టీవోలతో మంత్రి హరీశ్రావు ఉన్నతస్థాయి సమీ క్ష నిర్వహించారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో అమలవుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను సమీక్షించారు. ప్రభుత్వ పథకాలను అర్హులకు అందించడంపై దృష్టి సారించాలని ఆదేశించారు.
ప్రభుత్వ పథకాల్లో ఉమ్మడి జిల్లా ముందుండాలని స్పష్టం చేశారు. పెండింగ్ పనులు పూర్తి చేసి ప్రజలకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించే లక్ష్యంతో ముం దుకు వెళ్లాలని తెలిపారు. బీసీబంధు, గృహలక్ష్మి లబ్ధ్దిదారుల ఎంపిక ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని స్పష్టం చేశారు. మహిళల పేరుమీదనే గృహలక్ష్మి పథకం ఇస్తున్నం దునా అర్హులందరూ లబ్ధి పొందేలా ఎమ్మెల్యేలు కృషి చేయాలన్నారు. దశలవారీగా నియోజకవర్గాల్లో బీసీబంధు, గృహలక్ష్మి పథకాలను పూర్తి చేయాలని సూచించారు. గొర్రె ల పంపిణీ నిరంతరం కొనసాగుతుందని తెలిపారు. సీఎం కేసీఆర్ పెద్ద మనసుతో దివ్యాంగులకు ఇచ్చే రూ.3 వేల పెన్షన్ని రూ.4,116కు పెంచి, వారి జీవితాల్లో సంతోషాన్ని నింపారన్నారు. దివ్యాంగులందరికీ పెన్షన్ అందే విధంగా చూడాలని మంత్రి హరీశ్రావు ఆదేశించారు.
ఉమ్మడి మెదక్ జిల్లాలో పెండింగ్లో ఉన్న అభివృద్ధి పనులను వేగంగా పూర్తి చేయాలని మంత్రి హరీశ్రావు అధికారులను ఆదేశించారు. పీహెచ్సీ భవనాలు, పల్లె దవాఖాన భవనాలతోపాటు ఇతర పెండింగ్ పనులు త్వరగా పూర్తి చేయాలన్నారు. విద్యా సంవత్సరం ప్రారంభమైనందున ప్రతి నియోజకవర్గంలో ‘మనఊరు-మనబడి’లో భాగంగా పాఠశాల నిర్వహణ, మరమ్మతులు పూర్తి చేయాలన్నారు. అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో మిగిలిన పనులు ఉంటే, వాటిని కూడా పూర్తి చేయాలని మంత్రి సూచించారు. నియోజకవర్గాల్లో నిర్మాణంలో ఉన్న డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణాలను త్వరగా పూర్తి చేసి, లబ్ధిదారులకు అందజేసి, ఇండ్ల పట్టాలు అందించాలని అధికారులకు మంత్రి హరీశ్రావు ఆదేశించారు. ఉమ్మడి మెదక్ జిల్లా అభివృద్ధికి కోసం చేసిన విజ్ఞప్తులను ఎప్పటికప్పుడు స్వీకరించి వాటిని పూర్తి చేసిన మంత్రి హరీశ్రావుకు ఎంపీలు, ఎమ్మెల్యేలు, అధికారులు కృతజ్ఞతలు తెలిపారు.
సమావేశంలో ఎంపీలు బీబీ పాటిల్, కొత్త ప్రభాకర్రెడ్డి, ఎమ్మెల్యేలు గూడెం మహిపాల్రెడ్డి, చం టి క్రాంతికిరణ్, మదన్రెడ్డి, మాణిక్రావు, పద్మాదేవేందర్ రెడ్డి, ముతిరెడ్డి యాదగిరిరెడ్డి, సతీశ్కుమార్, ఎమ్మెల్సీలు యాదవరెడ్డి, సుభాష్రెడ్డి, రాష్ట్ర హ్యాండ్లూమ్ కార్పొరేషన్ చైర్మన్ చింత ప్రభాకర్, అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ ప్రతాప్రెడ్డి, సిద్దిపేట కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, మెదక్ కలెక్టర్ రాజర్షిషా, సంగారెడ్డి కలెక్టర్ శరత్, సిద్దిపేట పోలీస్ కమిషనర్ శ్వేత, మెదక్, సంగారెడ్డి ఎస్పీలు, అడిషనల్ కలెక్టర్లు, ఆర్డీవోలు పాల్గొన్నారు.