నర్సాపూర్, మార్చి 22 : మెదక్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డిని భారీ మెజార్టీతో గెలిపిస్తామని నర్సాపూర్ మున్సిపల్ చైర్మన్ అశోక్గౌడ్, వైస్ చైర్మన్ నయీమొద్దీన్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు చంద్రశేఖర్ అన్నారు. శుక్రవారం నర్సాపూర్లోని క్యాంప్ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. వెంకట్రామిరెడ్డి ఉమ్మడి మెదక్ జిల్లాకు అదనపు కలెక్టర్గా, సిద్దిపేట జిల్లాకు కలెక్టర్గా పనిచేశారన్నారు. ఈ ప్రాంతంపై వెంకట్రామిరెడ్డికి మంచి అవగాహన ఉందని, ఆయన అందరికీ సుపరిచితుడని తెలిపారు. ఇలాంటి వ్యక్తికి కేసీఆర్ ఎంపీగా పోటీ చేసేందుకు టికెట్ కేటాయించడం సంతోషంగా ఉందన్నారు. కాంగ్రెస్, బీజేపీ ఎన్ని కుట్రలు చేసినా మెదక్ పార్లమెంట్ స్థానం నుంచి బీఆర్ఎస్ గెలుపును అడ్డుకోలేరన్నారు. వెంకట్రామిరెడ్డికి నర్సాపూర్ నుంచి భారీ మెజార్టీ అందిస్తామని వెల్లడించారు. సమావేశంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు సత్యంగౌడ్, బీఆర్ఎస్ నాయకులు సూరారం నర్సింహులు, నగేశ్, ఆంజనేయులుగౌడ్, జ్ఞానేశ్వర్, బాల్రెడ్డి, రింగుల ప్రసాద్, వెంకటేశ్, నాగరాజుగౌడ్, మురళీగౌడ్ పాల్గొన్నారు.