మెదక్ మున్సిపాలిటీ, ఫిబ్రవరి 8: మున్సిపల్ ఎన్నికల దృష్ట్యా సోమవారం మెదక్లో నిర్వహించే కార్నర్ మీటింగ్కు మాజీ మంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు హాజరు కానున్నారని మున్సిపల్ మాజీ చైర్మన్ మల్లికార్జున్గౌడ్, బీఆర్ఎస్ పట్టణ కన్వీనర్ ఆంజనేయులు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. మధ్యాహ్నం 12 గంటలకు ఆర్అండ్బీ అతిథి గృహం నుంచి రాందాస్ చౌరస్తా వరకు భారీ ర్యాలీ నిర్వహిస్తామన్నారు.
రాందాస్ చౌరస్తాలో ఒంటిగంటకు జరిగే కార్నర్ మీటింగ్లో హరీశ్రావు మాట్లాడునున్నారని పేర్కొన్నారు. బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు, మాజీ ఎమ్మె ల్యే పద్మాదేవేందర్రెడ్డి, మెదక్ మున్సిపల్ ఎన్నికల ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్సీలు ఫరూఖ్ హుస్సేన్, శేరి సుభాష్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే శశిధర్రెడ్డి, బీఆర్ఎస్ మెదక్ నియోజకవర్గ ఇన్చార్జి తిరుపతిరెడ్డి, పార్టీ నాయకులు, కార్యకర్తలు హాజరు కానున్నట్లు పేర్కొన్నారు.