ఉమ్మడి పాలనలో తెలంగాణ ప్రాంతాన్ని వివక్షకు గురిచేశారని, నేడు సీఎం కేసీఆర్ హయాంలో పల్లెలు అభివృద్ధిలో పట్టణాలతో పోటీపడుతున్నాయని సంగారెడ్డి జడ్పీచైర్పర్సన్ మంజుశ్రీ జైపాల్రెడ్డి అన్నారు. మంగళవారం అందోల్ ఎమ్మెల్యే క్రాంతికిరణ్తో కలసి ఆమె మునిపల్లి మండలంలో పర్యటించి పలు గ్రామాల్లో రూ.రెండు కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఖమ్మంపల్లిలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ బీఆర్ఎస్ సర్కారు ప్రభుత్వ పథకాల్లో అన్ని వర్గాలకు ప్రాధాన్యమిస్తున్నదని, తెలంగాణలో అమలుచేస్తున్న పథకాలను మిగతా రాష్ర్టాలు కాపీకొడుతున్నాయన్నారు. ఎమ్మెల్యే క్రాంతికిరణ్ మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పలువురు లబ్ధిదారులకు గృహలక్ష్మి మంజూరు పత్రాలతో పాటు ఖమ్మంపల్లిలో నూతనంగా ప్రారంభించిన కేసీఆర్ కాలనీవాసులకు ఇండ్ల పట్టాలు అందజేశారు. – మునిపల్లి, అక్టోబర్ 3
మునిపల్లి,అక్టోబర్ 3: సీఎం కేసీఆర్ కృషితో గ్రామాలు అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నాయని సంగారెడ్డి జడ్పీ చైర్పర్సన్ మంజుశ్రీ జైపాల్రెడ్డి అన్నారు. మంగళవారం మండలంలోని ఇబ్రహీంపూర్, బుధేరా, అల్లాపూర్, ఖమ్మంపల్లి, బోడిశెట్పల్లి, లింగంపల్లి, మొగ్దుంపల్లి, తాటిపల్లి గ్రామాల్లో ఎమ్మెల్యే క్రాంతి కిరణ్తో కలిసి సుడిగాలి పర్యటన చేశారు. ఈ సందర్భంగా రూ.2 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఖమ్మంపల్లిలో ఏర్పాటు చేసిన సమావేశంలో జడ్పీ చైర్పర్సన్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలు సీఎం కేసీఆర్ వెంటే ఉన్నారన్నారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అధిక సంఖ్యలో సీట్లు గెలుపొంది, రాష్ట్రంలో మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందన్నారు. బీఆర్ఎస్తోనే గ్రామాల అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. అనంతరం మహిళలకు బతుకమ్మ చీరలు పంపిణీ చేశారు.
కేసీఆర్ కాలనీ ప్రారంభం
మునిపల్లి మండలంలోని ఖమ్మంపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన కేసీఆర్ కాలనీని జడ్పీ చైర్పర్సన్, ఎమ్మెల్యే ప్రారంభించారు. లబ్ధిదారులకు ఇండ్ల పట్టాలు అందజేశారు. కేసీఆర్ కాలనీ అభివృద్ధికి నిధులు మంజురు చేస్తానని ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ భరోసా ఇచ్చారు. కేసీఆర్ కాలనీలో రోడ్లు అభివృద్ధి చేస్తానని, మౌలిక సదుపాయాలు కల్పిస్తానన్నారు. జడ్పీటీసీ మీనాక్షీ సాయికుమార్ కృషితో ఖమ్మంపల్లి గ్రామానికి రూ.కోటికి పైగా నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన గృహలక్ష్మి పథకం గరీబోళ్లకు వరమని ఎమ్మెల్యే క్రాంతికిరణ్ అన్నారు. ఖమ్మంపల్లి గ్రామానికి చెందిన పలువురు లబ్ధిదారులకు గృహలక్ష్మి మంజూరు పత్రాలు అందిజేశారు. మండలంలోని బుధేరా చౌరస్తాలో వినాయక మండపం వద్ద ఏర్పాటుచేసిన కోలాటాల్లో ఎమ్మెల్యే సందడి చేశారు.కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకుడు పైతర సాయికుమార్, ఎంపీపీ శైలజా శివశంకర్, పార్టీ మండల అధ్యక్షుడు విజయ్కుమార్,ప్రధాన కార్యదర్శి మంతురి శశికుమార్, యువత విభాగం మండల అధ్యక్షుడు ఆనంద్రావు, మైనార్టీ అధ్యక్షుడు మౌలనా, ఆయా గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు, అధికారులు పాల్గొన్నారు.
బీఆర్ఎస్ గెలుపు ఖాయం
వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ గెలుపు ఖాయం. పార్టీ గెలుపే లక్ష్యంగా నాయకులు, కార్యకర్తలు పనిచేయాలి. బీఆర్ఎస్ ప్రభుత్వం అమలుచేస్తు న్న అభివృద్ధి సంక్షేమ పథకాలను గడప గడపకూ తీసుకుపోయి ప్రజలకు వివరించాలి. గత ప్రభుత్వాల హయాంలో ఒక్కో గ్రామానికి రూ.5 లక్ష లు ఇస్తే మహా ఎక్కువయ్యేది. బీఆర్ఎస్ ప్రభు త్వం ఒక్కో గ్రామానికి రూ.60 లక్షలకు పైగా ని ధులు మంజురు చేసి, గ్రామాలను అభివృద్ధి పథంలో నడిపిస్తున్నది. సీఎం కేసీఆర్ చొరవతో నే రాష్ట్రంలోని ప్రతి గల్లీలో సీసీరోడ్డు నిర్మించాం. తెలంగాణలోని ప్రతి పల్లెలో సీసీ రోడ్డు నిర్మించడంతో గ్రామాలు అందంగా కనబడుతున్నాయి. అందోల్ నియోజకవర్గంలో ప్రతి గ్రామానికి సుమారు రూ.50 లక్షలకుపైగా నిధులు కేటాయించారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీకి ఎదురులేదు. మునిపల్లి మండల అభివృద్ధికి పట్టువీడని విక్రమార్కుడి లెక్క నిధులు మంజూరు చేసుకునేదాక వినని వ్యక్తి పైతర సాయికుమార్. నిరంతరం పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నాడు.
– చంటి క్రాంతి కిరణ్, ఎమ్మెల్యే , అందోల్