మెదక్, ఫిబ్రవరి 13 (నమస్తే తెలంగాణ): ఎల్లలు దాటేలా ఏడుపాయల జాతరకు ఏర్పాట్లు ఘనంగా చేయాలని మెదక్ కలెక్టర్ రాజర్షి షా అధికారులకు సూచించారు. ఈ నెల 18 నుంచి 20 వరకు మూడు రోజుల పాటు నిర్వహించనున్న ఉత్సవ ఏర్పాట్లపై సోమవారం కలెక్టరేట్లో ఎస్పీ రోహిణి ప్రియదర్శిని, అదనపు కలెక్టర్లు ప్రతిమాసింగ్, రమేశ్తో సమీక్ష చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా పటిష్టమైన ఏర్పాట్లు చేయాలన్నారు. అధికారులు సమన్వయంతో 16 నాటికి పనులన్నీ పూర్తి చేయాలని సూచించారు.
ప్రతి ఒకరూ పిన్ పాయింట్ వారీగా రోజువారి షిఫ్ట్ ప్రకారం సిబ్బందికి విధులు కేటాయించి, పాసులు జారీ చేయాలన్నారు. తద్వారా సిబ్బంది విధులు సమర్థవంతగా నిర్వహిస్తారన్నారు. ఫోర్ వీలర్, ద్విచక్ర వాహన పాసుల జారీ, పారింగ్ని హేతుబద్ధీకరించడం వల్ల జాతరలో చాలా సమస్యలను అధిగమించవచ్చన్నారు. ఈసారి జాతరకు భారీగా నిధులు వచ్చినందున మరుగుదొడ్లు, బట్టలు మార్చుకునే గదులు, తదితర శాశ్వత ని ర్మాణాలు చేపట్టాలని సూచించారు. 16 నాటికి బారీకేట్లు పూర్తి చేసి ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలని, 600 మంది పారిశుధ్య కార్మికులను నియమించుకోవాలని, షవర్లు, తాగునీటి కుళాయిలు, వినియోగంలో ఉండేలా చూడాలన్నారు.
విద్యుత్కు అంతరాయం కలగకుండా చూడాలని, వైఫై జో న్లు పెంచాలని, జిల్లా నలుమూలల నుంచే కాకుం డా ఇతర ప్రాంతాల నుంచి బస్సులు నడపాలని, గజ ఈతగాళ్లు, వైద్యారోగ్య కేంద్రాలు ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. అనంతరం ఎస్పీ రోహిణి ప్రియదర్శిని మాట్లాడుతూ 16 నాటికి ఏర్పాట్లన్నీ పూర్తయితే, 17న పోలీస్ సిబ్బందికి బ్రీఫింగ్ ఇస్తామన్నారు. సమావేశంలో డీఎస్పీ సైదులు, జడ్పీ సీఈవో శైలేశ్, నీటిపారుదల శాఖ ఎస్ఈ ఏసయ్య, ఆర్డీవో సాయిరాం, ఏడీ మైన్స్ జయరాజ్, డీపీవో సాయిబాబా, జిల్లా అధికారులు, ఆలయ ఈవో సార శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.