జహీరాబాద్, జూలై 21: జహీరాబాద్ మున్సిపాలిటీలో అభివృద్ధి పనులు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.30 కోట్ల నిధులు విడుదల చేసింది. సీఎం కేసీఆర్, రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖల మంత్రి హరీశ్రావు ఈ నిధులు విడుదల చేశారు. మున్సిపాలిటీలో మౌలిక సదుపాయలు కల్పించేందుకు ఎంపీ బీబీ పాటిల్, ఎమ్మెల్యే మాణిక్రావు కృషి చేస్తున్నారు. మాజీ కౌన్సిలర్ రవికిరణ్ మంత్రి హరీశ్రావు కృతజ్ఞతలు తెలిపారు.
అందోల్, జూలై 21: అందోల్- జోగిపేట మున్సిపాలిటీ అభివృద్ధికి ప్రభుత్వం రూ.25 కోట్ల నిధులు మంజూరు చేసిందని ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ శుక్రవారం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ మున్సిపాలిటీ అభివృద్ధికి గతంలో రూ.25కోట్ల ప్రత్యేక నిధులు కేటాయించారన్నారు. ఆ నిధులతో అభివృద్ధి పనులు వేగవంతంగా జరుగుతున్నాయన్నారు. ఇప్పుడూ మళ్లీ మరో రూ.25 కోట్లు మంజూరు చేశారన్నారు. అందోల్- జోగిపేట మున్సిపల్పై ప్రత్యేక దృష్టి పెట్టి నిధులు మంజూరు చేసిన సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు తెలిపారు. సహకరించిన మంత్రులు కేటీఆర్, హరీశ్రావుకు ధన్యవాదాలు తెలిపారు.