మెదక్ : ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు చేరవేయాలని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ ( Collector Pratima Singh) అధికారులకు సూచించారు. రాష్ట్రంలో భారీగా ఐఏఎస్ ( IAS ) అధికారుల బదిలీలు జరిగిన అనంతరం కలెక్టర్లుగా జిల్లాకు బదిలీ అయిన అధికారులు వెంటనే ఆయా జిల్లాలకు వెళ్లి బాధ్యతలు స్వీకరించారు.
ఈ సందర్భంగా నూతన కలెక్టర్గా బదిలీ అయిన ప్రతిమా సింగ్ జిల్లాకు చేరుకోవడంతో అదనపు కలెక్టర్ నగేష్, డి ఆర్వో భుజంగ రావు, మెదక్ ఆర్డీవో రమాదేవి స్వాగతం పలికారు. బాధ్యలు స్వీకరించిన అనంతరం అధికారులు జిల్లా అధికారులు మర్యాద పూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు.
ప్రభుత్వం అప్పగించిన బాధ్యతను నెరవేర్చుతూ ,ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు అందేలా కృషి చేస్తానన్నారు. ఇంటర్, పదో తరగతి పరీక్షల గురించి డీఈవోను, ఇంటర్ బోర్డు అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీ సీఈవో ఎల్లయ్య, జిల్లా అధికారులు పాల్గొన్నారు.